ఒక చిన్న కథ

ఒక చిన్న కథ https://ajaraamarasukthi.blogspot.com/2025/11/blog-post_22.html సంస్కృతము చెల్లుబాటయ్యే రోజుల్లో ఇద్దరు పండితులు వీధి లో పోతూవుంటే ఒక కొట్టు యజమానియైన చక్కటి అమ్మాయి తన కొట్టులో కూర్చొని వుండినది . ఓ ఒక పండితుడు ఆమె వద్దకు పోయి 'తూర్ణం ఆధీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే' అన్నాడు . అక్కడికి శ్లోకముయొక్క ఒక పాదము పూర్తి అయ్యింది. ఇక రెండవ పండితుడు వచ్చి రెండవ పాదమును ఈ విధంగా చెప్పినాడు : 'పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాన్తాకీర్ణ లోచనే' అంటే బంగారు రంగులో వుండే తమలపాకులు(బాగా మాగినవి అని అర్థము) కూడా, ఓ చెవులవరకు కన్నులు కలిగిన మదవతీ, ఇవ్వు అని అన్నాడు . రెండవ పండితుడు చెవులకింపుగా ఉండేవిధముగా రెండు విషయాలన్నాడు: 1. మొదటి పండితుడు మొదటి పాదములో 'ణ' మూడు పర్యాయములు రానిస్తే రెండవ వ్యక్తి తన రెండవ పాదములో 'ణ ' ను ఐదు పర్యాయములు రానిచ్చినాడు. 2. నీకళ్ళు ఆకర్ణాతము వున్నాయి తామర రెక్కలలాగా అని పొగడినాడు. అందువల్ల ఆమె అతనికే ముందు ఆకులు వక్కలు సున్నము కూడా ఇచ్చిందట. ఇక్కడ తూర్ణం=కొద్దిగా చూర్ణం=సున్నము అధీయతాం=ఇవ్వుము అని అర్థము . మిగిలినదంతా మీకు తెలిసిందే .

Comments

Popular posts from this blog

గౌతమ మహర్షి - అహల్యాదేవి

హిరణ్య వర్ణా (సూర్య స్తుతి)

విద్యారణ్యులు - విజయనగరము