అసాధారణ ప్రజ్ఞాశాలి చెట్టూర్ శంకరం నాయర్ గారు
ర్
అసాధారణ ప్రజ్ఞాశాలి
చెట్టూర్ శంకరం నాయర్ గారు
https://ajaraamarasukthi.blogspot.com/2025/06/blog-post_11.html
శంకరన్ నాయర్ 1857 జులై 11 న పాలక్కాడ్ జిల్లా, మంకర గ్రామంలో హిందూ కులీన కుటుంబానికి చెందిన నాయర్
మన్మయిల్ రాముణ్ణి పణిక్కర్, పార్వతీ అమ్మ చెట్టూర్ దంపతులకు జన్మించినాడు. అతని ప్రారంభ
విద్య సంప్రదాయ శైలిలో ఇంట్లో ప్రారంభమైనది. తరువాత మలబార్లోని పాఠశాలల్లో
కొనసాగింది. అతను కాలికట్లోని ప్రాంతీయ పాఠశాల నుండి ఆర్ట్స్ పరీక్ష మొదటి తరగతిలో
ఉత్తీర్ణత సాధించినాడు. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి 1877లోతన ఆర్ట్స్
పట్టాను పొందినాడు.రెండు సంవత్సరాల తరువాత మద్రాస్ న్యాయ కళాశాలనుండి లా పట్టాను
పొందినాడు.
ఆతరువాత నాయర్ గారు 1880 లో మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాది వృత్తి
ప్రారంభించినాడు.1884 లో మద్రాస్
ప్రభుత్వం అతడిని మలబార్ రాష్ట్రంపై ఒక విచారణ సంఘంలో సభ్యుడిగా నియమించింది. 1908 వరకు, ఆయన
ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ గా మరియు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేసినాడు. 1908లో, ఆయన మద్రాసు ఉన్నత న్యాయస్థానం శాశ్వత న్యాయమూర్తి
పదవి చేపట్టినాడు.1915 వరకు ఆ పదవిలో
ఉన్నాడు. ఆయన సి.ఎ. వైట్,
అప్పటి మద్రాస్
ప్రధాన న్యాయమూర్తి విలియం ఐలింగ్తో పాటు, కలెక్టర్ ఆషే హత్యకేసును ప్రత్యేక కేసుగా విచారించిన బృందలో
ఒకసభ్యుడు.
ఈ లోగా 1902లో వైస్రాయ్ లార్డ్ కర్జన్ అతడిని రాలీ విశ్వవిద్యాలయ
కమిషన్ కార్యదర్శిగా నియమించినాడు. అతని సేవలకు గుర్తింపుగా 1904లో ఆయన చక్రవర్తి
చేత భారత సామ్రాజ్య సహచరుడి (Companion of the Indian
Empire) )గా1912లో అతనికి నైట్
లభించింది. ఇది సాధారణమైన విషయము కాదు.
ఆయన ప్రజ్ఞకది
నిదర్శనము.
అతను 1915లో ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో బాధ్యతతో వైస్రాయ్ కౌన్సిల్లో
సభ్యుడయినాడు. 1919 లో భారత
రాజ్యాంగ సంస్కరణలపై సభ్యునిగా రెండు ప్రసిద్ధ సూచనలతో తన అసమ్మతి వ్రాసి
తెలియజేసినాడు. భారతదేశమును పాలించు బ్రిటిష్ పాలన లోని వివిధలోపాలను ఎత్తిచూపుతూ
సంస్కరణలను సూచించినాడు. ఒక భారతీయుడు అలాంటి విమర్శలు, సూచనలు చేయడం, ఆ రోజుల్లోనే ఒక
భారతీయుడు స్వతంతరించి తెలిపినాడంటే నమ్మశక్యంుకాదు.
బ్రిటిష్ ప్రభుత్వం అతని సిఫార్సులను చాలావరకు ఆమోదించింది. 1919 ఏప్రిల్ 13 న జలియన్వాలాబాగ్
మారణకాండ తరువాత నాయర్ వైస్రాయ్ కౌన్సిల్కు రాజీనామా చేసినాడు.
ఆ రోజుల్లో భారత జాతీయ ఉద్యమమునకు అంగబలము చేకూర్చేపనిలో
అతను చురుకైన పాత్ర పోషించినాడు.1897లో,
మద్రాసులో మొదటి ప్రొవిన్షియల్
కాన్ఫరెన్స్ సమావేశమైనప్పుడు, దానికి అధ్యక్షత వహించడానికి కార్యకర్తలు ఆహ్వానించినారు. అదే సంవత్సరం భారత జాతీయ
కాంగ్రెస్ అమరావతిలో సమావేశమైనప్పుడు, అతను దాని అధ్యక్షునిగా ఎన్నుకోబడినాడు . ఆయన తన అధ్యక్ష ప్రసంగంలో, విదేశీ పరిపాలన న
నియంతృత్వమును ప్రస్తావిస్తూ, సంస్కరణలకై పిలుపునిచ్చినాడు.******* స్వతంత్ర హోదాతో
భారతదేశానికి స్వయం పాలన కోరినాడు. 1900 లో,
అతను మద్రాస్
లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. 1908 నుండి 1921 వరకు గడిపిన ఆయన అధికారిక జీవితము నిష్కామ రాజకీయ కార్యకలాపాలకు అంతరాయము కలిగించింది. కానీ
1928లో అతను సైమన్
కమిషన్కు సహకరించడానికి భారత కేంద్రకమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. భారతదేశ స్వాతంత్ర
ప్రతిపత్తి హోదా ఒక సమితిని ఏర్పాటుచేయాలని గట్టిగా వాదించుటకు నివేదికను సిద్ధం
చేసినాడు. భారతదేశానికి అంతిమ లక్ష్యంగా స్వయం
ప్రతిపత్తిని మంజూరుచేస్తూ వైస్రీగల్ ప్రకటన వచ్చినప్పుడు, సర్ శంకరన్ నాయర్
క్రియాశీల రాజకీయాలనుండి విరమణ
ప్రకటించినాడు.అతను 1934 లో, 77 సంవత్సరాల
వయస్సులో మరణించినారు .
We care for Madras that is Chennai. Madras
Musings (17 June 1911). Retrieved on 2012-06-11.
London Gazette, 21 June 1904
London Gazette, 12 July 1912
Gautam Sharma (1 January 1996).
Nationalisation of the Indian Army, 1885–1947. Allied Publishers. p. 113. ISBN
978-81-7023-555-2. Retrieved 11 June 2012.
Autobiography of Sir C. Sankaran Nair. Lady
Madhavan Nair. 1966.
"V M M Nair, India's oldest ICS officer's
100th birthday on Oct 8 || Whispersinthecorridors".
www.whispersinthecorridors.com. Archived from the original on 9 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.
Morais, John Victor 1910- (1985). P.P.
Narayanan a world trade unionist : a biography. Unik Printguide
మోహన్ దాస్ కరంచంద్ గాంధీగారి నిజస్వభావమును గూర్చి తన పుస్తకంలో ‘గాంధీ మరియు అరాచకం’ (1922), అన్న పుస్తకములో శంకరన్ నాయర్ గారు విపులముగా
విలేవారీగా తెలియజేసినారు. గాంధీ జాతీయవాదము పై దాడి చేసీనాడు అని తెలిపినారు. సహాయ
నిరాకరణ ఉద్యమం మరియు మార్షల్ లా కింద బ్రిటిష్ చర్యలు అన్నవిషయాలపై ఎంతగానో తెలియజేసినారు.
ఈ రచన 1919 పంజాబ్ తిరుగుబాటు సమయంలో భారతదేశ లెఫ్టినెంట్ గవర్నర్ సర్
మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ'డ్వైర్ను అవమానించిందని బ్రిటిష్ కోర్టు తీర్పు ఇచ్చింది. వర్గాలు:
1934 మరణాలు1857 జననాలుఆర్డర్
ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ సహచరులురచయితలుమద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు భారత
జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు, దేశం కోసం పోరాటం
చేసిన ఎంతో మందిని. కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందని, కనీసం వాళ్ల గురించి ఏ
ఒక్క రోజు కూడా ఆలోచించలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ముఖ్యంగా కేరళకు
చెందిన న్యాయవాది, స్వాతంత్ర సమర యోధుడు
చెట్టూర్ శంకరన్ నాయర్ సేవలను కాంగ్రెస్ పూర్తిగా మర్చిపోయిందన్నారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు
చెందిన ప్రతీ ఒక్కరూ ఆయన దేశానికి చేసిన సేవలను తెలుసుకోవాలని చెప్పారు. ప్రధాని
మోదీ మరీ ఇంతగా చెప్పిన ఈ శంకరన్ నాయర్ ఎవరు, ఆయన దేశం కోసం ఏం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హర్యానాలోని యమునా నగర్లో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తూ ప్రజలను
ఉద్దేశించి ప్రసంగించినారు. ఈ సందర్భంగానే మోదీ గారు చెట్టూర్ శంరన్ నాయర్ను
గుర్తు చేసీనారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం శంకరన్
నాయర్ ను పక్కన పెట్టిందన్నవాస్తవాన్ని
తెలియబరచినారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని
ప్రతీ ఒక్కరూ ఈయన గురించి తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా శంకరన్ నాయర్ చేసిన సేవలు
గుర్తు చేస్తూ.. 1919లో అమృత్ సర్లో
జరిగిన జలియన్ వాలాబాగ్ దమనకాండకు వ్యతిరేకంగా ఆయన చేసిన న్యాయ పోరాతమును గూర్చిన
వాస్తవాలను తెలియజేసినారు.
బ్రిటీషర్ల క్రూరత్వానికి
నిదర్శనంగా నిలిచిన జలియన్ వాలాబాగ్ ఘటనను.. ఎవరికీ తెలియకుండా దాచి పెట్టారని
ప్రధాని మోదీ గుర్తు చేసీనారు. అయితే బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న
శంకరన్ నాయర్.. జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత పదవికి రాజీనామా చేసి.. బ్రిటీషర్లకు
వ్యతిరేకంగా ఆయన స్వరం వినిపించినారని పేర్కొన్నారు. పుట్టి పెరిగిందంతా కేరళలోనే
అయినా పంజాబ్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోతపై న్యాయ పోరాటం చేసి.. బ్రిటీష్
సర్కారు పునాదుల్ని కదిలించినారన్నారు. ఈ అంశంపై బ్రిటీష్ ప్రభుత్వాన్ని కోర్టుకు
ఈడ్చినారని వెల్లడించినారు. ఈ పోరాటస్ఫూర్తే స్వాతంత్రోద్యమానికి బాటలు వేసిందని
వెల్లడించినారు.
బంధువులు
లెఫ్టినెంట్
జనరల్ కాండెత్, యుద్ధ వీరుడు గోవా విమోచకుడు,సర్ శంకరన్ నాయర్ మనవళ్లలో మరొకరు.
అతని మేనల్లుడు, విఎమ్ఎమ్ నాయర్, బారతదేశంలో 2019 అక్టోబరు 8న 100 పుట్టినరోజు జరుపుకున్నాడు. నాయర్ భారతదేశంలో జీవించి ఉన్న అత్యంత పురాతన
ఐసిఎస్ అధికారి. శంకరన్ నాయర్ మనవడు (మేనకోడలు అమ్ముకుట్టి అమ్మ కుమారుడు) కెకె చెట్టూర్, ఐసిఎస్ అధికారి, జపాన్లో భారతదేశపు మొదటి
రాయబారిగా పనిచేశాడు. అతను జయ జైట్లీ తండ్రి, రాజకీయవేత్త, సోషలిస్ట్, ఆమె భర్త అశోక్ జైట్లీ జమ్మూ
కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి. జయ తరువాత సోషలిస్ట్ పార్టీ నాయకురాలు, యునినాన్ మంత్రి జార్జ్
ఫెర్నాండెస్తో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిఉన్నారు. ఇది మరణించే సమయంలో ఆమె
ఫ్రెనాండస్ చట్టబద్దమైన భార్య లీలా కబీర్ మధ్య వైరానికి దారితీసింది. జయ కుమార్తె
అదితి మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను వివాహం చేసుకుంది.
అకుంఠిత
దీక్షాదక్షుడు, జలియన్ వాలా బాగ్ కోర్టు కేసును
నిర్భీతితో ఆంగ్లేయ అధకారులను ఎండగట్టిన మేరు నాగ ధీరుడు. ఆయనకు త్రికరణ శుద్ధితో నమస్కరించుటతప్ప
మనము వేరేమి చేయగలము.
స్వస్తి.
Comments
Post a Comment