నా తెలుగు
నా తెలుగు
https://ajaraamarasukthi.blogspot.com/2025/05/blog-post_30.html
Thug Life అన్న సినిమాలో నటించిన కమలహాసన్ గారు బహుశా బంగళూరు లొ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ శివరాజ్ కుమార్ గారిని చూపించి ఈయన మా మిత్రుడే, కన్నదాభాష తమిళము నుండి పుట్టినదే కదా! అన్నాడు. ఆమాటను ఒప్పుకోని అన్ని కన్నడ వర్గాలు నిరసనాలకు ప్రదర్శనలకు దిగినాయి. ఈ విషయము పై విశ్లేషించుతూ ఒక సాక్షాత్కార్య సంభాషణ (Jnterview)లో ఒక పాత్రికేయుడు ఇంచుము, తమిళము, దాక్షిణాత్య భాషలలొ మొదటిది పైగా ఆ భాషలోనే మొదట గ్రంథ రచన మొదలయినది. ఈ మాటలకు వత్తాసుగా, తోల్కాపియం, సగం కవుల రచనలను ఉటంకించుతారు. ఇది ఆగస్త్యుని రచనగా చెబుతారు. ఆగస్త్యుడు విశ్వనాథుని ఆజ్ఞానుసారము ఉత్తరము నుండి దక్షిణమునకు వచ్చిన మహర్షి. అక్కడి అప్పటి స్థానికులకు అనుకూలముగా ఈ భాషను అందజేసినాడని ప్రతీతి. కంచి నాదచేదేవుడగు చంద్రశేఖర సరస్వతి స్వామివారు సంస్కృతము సకల భాషలకు మూలముకాగా, నవ వ్యాకరణములలో తమిళ వ్యాకరణము మొదటిదని చెప్పినారు.
వ్యాకరణము లేని భాషలను మాట్లాడేవారు నేటికీ ఎందరో ఉన్నారు. కావున తమిళము ఆది దక్షిణాది భాషయానుటకు ఆధారాలు లేవు.
ఇక ఒక భాష పుట్టుకకు గ్రంధ రచనకు సంబంధము ఉండదు. భారతమును నమ్మయ్య(11వ శతాబ్ది) అరణ్య పర్వము మధ్యన నిలిపితే దానిని పూర్తి చేయుటకు ఎర్రన వరకూ, కారణములేవయినా ఎర్రనకు (1320-1400 14 వ శతాబ్ది) పూర్వము poonukonnavaarulపూనుకొన్నవారు లేదు. వీరిరువురి నాడుమాన తిక్కన (1205-1288 - 13 వ శతాబ్ది) శేషభాములనీ పూరించినాడు. గమనించినారంటే ఒక్కొక్క మహానుభావునికి మధ్య 100 సంవత్సరాల ఆంతర్యము ఇంచుమించుగా ఉన్నది. సంస్కృత భారతము తరువాత ఇంత ప్రశస్తి హిందూదేశములోని ఏభయషకూ లేదు. కన్నడ భారత కవిత్రయములో పంపకవి తెలుగువాడే!కన్నడ లిపి ని బహుశా తెలుగువారు అనుసరించినారెమో! అసలు ఒకానొక కాలములో ఈ రెండు భాషాలూ ఒకటిగా ఉండి తెలుగన్నడము హలెగన్నడము గా విడిపోయింట్లు ఒక ప్రముఖ భాషాశాస్త్రవేత్త వ్రాయగా చవీయుండినాను. ఈ సంయుక్తభాషకు ప్రాకృతము మూలము. కాల్డ్వెల్ గారు క్రిస్టియన్ మిషనరీగా వచ్చి తమిళము అభ్యసించి ఈ ప్రోటో ద్రావిడియన్ సిద్ధాఓ టమును ప్రతిపాదించి ధయాక్షిణాది భాషలకు ఒక మూల భాష ఆధారమని చెప్పుటయేగాక అది తమిళమును ఈ ప్రస్తాపన తేలేదు. 'వారు 'జననీ సంస్కృతాంబూ..'బాణీయే అన్నారు. బోలి యుండెడిది అని కూడా చెప్పినారు. దానితో తమిళులు ఈ వాదమునకు తమ మడ్డట్టుతేలిపి పుష్టిని చేకూర్చినారు. అంటే కాల్డ్వెల్ చెప్పేవారకూ అంతటి పండితులు తమిళములో పుట్టలేదని ఊహించవలసి ఉంటుందా!ఆగస్త్యునికన్నా సంగం కవి పండితులకన్నా కాల్డ్వెల్ ఏవిధముగా గొప్పవాడనిపించుకోగలడు. తెలుగునందు ప్రాచీనకవులగు నన్నయమొదలు రాయలు అష్టదిగ్గజాములవరకూ ఎవరూ 'జననీ సంస్కృతాంబు..'అనేయే అన్నారు గానీ ద్రావిద్యభాష అన్న ఊసు ఎత్తనేలేదు. జక ఆ విలేఖరి చెప్పిన మాటలలో తెలుగు మూడవదిగానూ. కన్నడ రెండవది గానూ పేర్కొన్నారు. కారణము 'తోల్కాప్పియం' మొదటి గ్రంధమన్నారు. ఇది ఒక వ్యాకరణ గ్రంధము మాత్రమేనని పెద్దలు చెప్పగా వినీయునదినాను. ఇక సంగం కవులు వాడిన తమిళములో పుంఖాను పుంఖాలుగా తెలుగు పదాలున్నాయని తెలుగు లెంక రాము అన్న తమిళనాడులో స్థిరపడిన తెలుగు పండితుడు తెలుపగా చదివినాను. ఇక భాషపుట్టుకకూ గ్రంధము వ్రాయుటకు ముడిపెట్టనవసరము లేదు.అసలు ద్వాపరములోనే ఆంధ్రులు రాజులయి ఉండినారాని 'చాణూ రాంధ్ర నిశూదనః' అన్న విష్ణు సహస్రనామ శ్లోకములోనే ఆంధ్రము. ఆంధ్రుల ప్రాచీనత తెలియవస్తూవుంది. ఆంధ్రము అరవిందము, సుమగంధము, మకరందము, శశి చందము. తమిళ ప్రసిద్ధ కవి తన తమిళ గీతములో 'సుందర తెలింగిల్'అన్నారు. జ్ఞానపీఠ పురస్కారముకన్నే ఇది ఎంతో గొప్పదని నేను తలుస్తాను. ఆంధ్రమాతకు జేజేలు .
Comments
Post a Comment