ఆది శంకరులవారి కాలనిర్ధారణ

ఆది శంకరులవారి కాలనిర్ధారణ

https://ajaraamarasukthi.blogspot.com/2025/05/blog-post_27.html

ఆది శంకరులవారి కాలనిర్ధారణ
(ఇది ఉపోద్ఘాతము మాత్రమే! రేపు విషయము ప్రారంభించుతాను,)
చరిత్ర మన గతవైభవమునకు అద్దము. కుహనా చారిత్రికులు హీన చరిత్ర గలవారిని Heroలగా చేసి పాఠ్యాంశముల పేరుతో మన నెత్తిన రుద్దినారు. కన్నుతెరిచే సమయము మనకు  పట్టినది 70 సంవత్సరములు. Better Late Than Never అన్న ఆంగ్ల సామెత ప్రకారము మనము ఇప్పటికైనా కళ్ళుతెరచి మన గత  ప్రాభవమును గూర్చి తెలుసుకొనుట ప్రారంభించినాము. చరిత్ర అను మణిహారమునకు పథకము జగద్గురువు శంకరులవారు. వివరముగా వారిని గూర్చి తెలుసుకొండి.
ఈ వ్యాసము సాదికారుగా శంకరులవారి కాలనిర్ణయము చేయుచున్నది.
జగద్గురు శంకరాచార్యులవారి కాలము
 ఈ ఆర్యమత అనుయాయులు కనీసము ఆయనను స్మరించుకుంటే అంతకు మించిన కృతజ్ఞత వేరొకటి లేదు. నా వంతుగా ఆ అపర శంకరులకు పాదాభివందనము చేస్తూ వారి కాలమును గూర్చిన సందేహ నివృత్తి చేయ ప్రయత్నిచినాను ఈ వ్యాసమను చదివి మీరు తెలుసుకోవాలన్నది నాతపన.అసలు ఎప్పుడో జరిగిపోయినడనికి 
ఈ ఒక్క శ్లోకము ఆయన గొప్పదనమును చెబుతుంది.ఆ శ్లోకమునకు ముందుగా ఈ విషయమును గణనించండి
ముఖ్యముగా ముస్లిములు, ఆంగ్లేయులు మనకు మొఘలు చక్రవర్తుల,వారితండ్రులను సోదరులను దారుణముగా చంపిన వాస్తవాలమరుగుపరచి, ఘనతను గూర్చి, మెల్కోటే గోవా దారుణ మారణ కాండల మరుగుపరచి, కుట్రలతో మన సంపదలదోచుకుపోయిన ఐరోపా సముద్రపు దొంగలగు పాశ్చాత్య ప్రభువులగూర్చి తెలిపినారు. కానీ నిజమగు చరిత్రలైన రామాయణ భారతముల గూర్చిగానీ, విక్రమార్క  భోజులను గూర్చి గానీ యోధానుయోధులైన, పృథ్వీరాజు,రాణా సంగా, రాణా ప్రతాప్, రాణీ అహల్యాబాయి హోల్కర్ ఇత్యాది అనేక వీరులను వీరవనితలను తెరమరుగు చేసినారు.అందుకుగాను ముందు మన పుట్ట్పూర్వోత్తరాలు తెలుసుకొంటే అనేకులగు ప్రతిభావంతులగు శూరులను వేలికితీయవచ్చును. పైన తెలిపి ణ అభూత కల్పనలను తిప్పి కొత్తవచ్చును. ఇక శ్లోకమును గూర్చి తెలుసుకొందాము.
అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ I
షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రిమ్శే మునిరత్యగాత్ II
8 సంవత్సరాల చిరుత వయసులో వేదాధ్యనము ముగించి 12 సంవత్సరాలకు సకల శాస్త్రములను ఆపోశనము పట్టి, 16 సంవత్సరములకు బ్రహ్మసూత్ర భాష్యములు వ్రాసి 32 వ ఏటికి ఆ మహనీయుడు కైలాసగతుడైనాడు. అటువంటి మహనీయుని కాలమును గూర్చి,వాస్తవాలను తెలుసుకొని మీ పూర్వులు ప్రపంచములోని ె జాతీకన్నాను విశస్తమైనది, మహా మేధావులకు జన్మనిచ్చినది, ఆంగ్లేయులు వ్రాసిన చరిత్రలో లేని ప్రమార వంశీయ విక్రమార్క చక్రవర్తి మరియు అట్టి అవక్ర విక్రములను గూర్చి చదివి తెలుసుకోండి.

ఆది శంకరులవారి కాలనిర్ధారణ - 1 వ భాగము 
సనాతన ధర్మ  ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు . ఆది శంకరులుశంకర భగవత్పాదులుఅపర శంకరులు అని కొనియాడబడే జగద్గురు శంకరాచార్యులవారిని గూర్చి ప్రతి సనాతన ధర్మావలంబికి తెలుసుకొనవలసిన బాధ్యత ఎంతైనా వున్నది. ఆయన  గురువేగాకమహాకవిమహా భక్తుడువేదాంతి,ఒక సన్యాసి రూపములో ఈ పుణ్యభూమి నాలుగు చెరగులు నడచి ధర్మ ప్రతిష్ఠ చేసిన మహనీయులు .
శంకరులు  ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతము సార్వజనీనము. శంకరులు సాక్షాత్తు పరమశివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించినాడు. (శివరహస్యము అన్న గ్రంధము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడునీల లోహితుడు అనగా నీలి వర్ణపు రక్తము గలిగిన వాడు అని అర్థము. కాలకూట విషము మింగుట వలన ఆయన రక్తమునకు ఆ వర్ణము కల్గినది అన్నది అన్వయము. ఆయనే శివుడు.ఆయనే  స్వయంగా శంకరుల రూపంలో అవతరించినారు. (కూర్మపురాణం నుండి).ఈ సనాతన ధర్మముపై  శంకరుల ప్రభావం అసమానమైనది.
శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించివారిని ఒప్పించినెగ్గిశంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పింపజేసినాడు. అసలు ఆయన బౌద్ధముకన్నా ఇతరములైన సనాతన ధర్మ శాఖలను తన వాదముచే సమన్వితము చేసి సంఘటిత పరచినాడు.ఉపనిషత్తులకుభగవద్గీతకుబ్రహ్మసూత్రాలకువిష్ణు సహస్ర నామములకు భాష్యములు వ్రాసినారు. తరువాత శంకరుల అనుసరించినవారికీశంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్త మైనాయి.
శృంగేరిద్వారకపూరిజ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలనుస్థాపించినారు. అవి శంకరుల సిద్ధాంతానికిహిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేచేస్తూ వున్నాయి. వారు రచించిన అనేకానేక భక్తి వేదాంత గ్రంధములను పరిగణన లోకి తీసుకొని అందునుండి 'భజగోవిందము' అన్న అతి చిన్న పుస్తకమునకు  టిప్పణి వేదాంతులలో నిష్ణాతులైనవారు వ్రాస్తే 1000 పుటలకు తక్కువగాని గ్రంథమౌతుంది. శంకరులవారి
జీవితమును గూర్చి, అంటే కాలడి, పూర్ణానది, సన్యాసము, తల్లి ఉత్తరక్రియలు సన్యసించినా కూడా తల్లికి ఇచ్చిన మాట నిలుపుకొనుటకు కాలడికి సమయానికి వచ్చి జరపతము, నాలుగు ఆమ్నా య పీఠములు స్థాపించినది , ఈ సనాతన ధర్మమును పునః ప్రతిష్ఠించినది నేను విస్తారముగా తెలుపుట లేదు ఎందుకంటే ఇది ఎక్కువమందికి తెలిసినదే కాబట్టి. ఇప్పుడు ముఖ్యముగా ఆయన కాల నిర్ధారణను గూర్చి మాత్రమె తెలుపుచున్నాను.
శంకరులవారి కాలనిర్ధారణ 
'చరిత్రఅంటే 'చత్తరాఅనే కాలము లో మనమున్నాము. తల్లి తండ్రుల చాయాచిత్రములు పదిల పరచుకొనే పిల్లలను ఇంకా మనము చూస్తూనే ఉన్నాము. మరి ఆ తల్లిదండ్రులు గతించినా చిత్తరువులు గోడనతుకు కొనియే   వున్నాయి కదా మరి అది చరిత్ర కాదా. ఆ చిత్రములు మాలలువేసి బొట్లు పెట్టి ధూపదీపములుసమర్పించి  మన భక్తీ ప్రపత్తులను చాటుకొంటాము . మన కుటుంబ అభివృధ్ధి కొరకు పాటు పడినవారినే గుర్తు పెట్టుకొని తరువాతి తరానికి ఆ పెద్దల గొప్పదనాన్ని అందజేస్తున్నామే మరి విశ్వ శ్రేయస్సు కోసం నిస్స్వార్థంగా శ్రమించిన మహనీయుల చరిత్ర గుర్తు పెట్టుకోనవసరం లేదా. కాస్తో కూస్తో మేలుచేసిన కారణానికి జయంతులనివర్ధంతులని ఆయా తేదీలు గుర్తుపెట్టుకొని కొందరు పెద్దలకు నివాళులర్పించుకొంటున్నామే మరి విశ్వ శ్రేయస్సే ప్రాధాన్యముగా మరల భూమి పై ధర్మప్రతిష్ఠాపనకు కంకణం కట్టుకొని నెరవేర్చి అతిపిన్న వయసులోనే పరమపదించిన జగద్గురువులైన శంకరుల వారి కాలనిర్ణయము తెలుసుకోన వలసిన బాధ్యతా మనపై లేదా!

మనచరిత్ర పై మనకు భక్తీగౌరవముశ్రద్ధ మనకుంటుంది. మన ప్రవర మన ప్రక్కన యున్నవాడు చెబితే మనకెట్లుంటుంది. మన చరిత్ర ఆంగ్లేయులు చెబితే మనకూ అట్లే వుండాలి కదా. ఒక సంస్థ తన కార్యాచరణ బేరీజు వేసుకోవాలంటే తన గత ప్రస్థుత పరిస్తితులను పరిగణనలోకి తీసుకొని భవితకు బాట వేసుకొంటుంది. మరి సంస్థలకే చరిత్ర అవసరమైతే దేశానికి అవసరం లేదా. గతము గుర్తుంచుకొంటే ఆ గుర్తులవెంట మనము నడవ వచ్చు.

మన చరిత్ర తమకన్నా ప్రబలమైనది కాకూడదనే దుర్భుద్ది తో మన చరిత్ర వ్రాసినవారు పాశ్చాత్యులు . అందులోభాగంగానే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి కాలాన్ని క్రీ.శ. 788 గా నిర్ణయించినారు.మన మొదటి ప్రధాని పుణ్యమాయని ఇప్పటికీ మనకు ఆంగ్లేయుల వుచ్చిష్టము మెసవక తప్పుటలేదు.

'విమర్శకాగ్రేసర''భారత చరిత్ర భాస్కరమహామహులైన కోట వెంకటాచలం గారు శంకరులవారి కాలాన్ని సహేతుకంగా నిరూపించినారు. ఆ వెలుతురులో మన యానము ప్రారంభించుదాము.

శంకరుల కాలమునుండి అవిచ్ఛిన్నముగా గురుపరంపర గలిగిన జోషిమఠము,పూరి,ద్వారక,కంచి మఠములు కలి 2593(క్రీ.పూ. 509) శంకరుల కాలంగా నిర్ణయించినారు.

ఈ వాదమునకు నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆదివారం నాడు పునర్వసు నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు శివగురు ఆర్యాంబ దంపతులకు జన్మించినట్లు ఈ క్రింది శ్లోకము తెలియబరచుతుంది. ఇది శంకరులవారి సహాధ్యాయులుగా వుండి పిమ్మట వారి శిష్యుడై సన్యసించివారి తదనంతరము గూడా బ్రతికిన చిత్సుఖాచార్యుల వారు వ్రాసిన 'బృహత్ శంకర విజయములోనిది.
"తిష్యే ప్రయాత్య నలసేవధి బాణనేత్రే |
యే నందనే దినమణా వుదగధ్వభాజి |
రాధే సితేరుడువినిర్గత మంగ లగ్నే ప్యా  |
హూతవాన్ శివగురుః సచ శంకరేతి ||
అనల =3(త్రేతాగ్నులు)సేవధి==9(నవ నిధులు),బాణ = 5(పంచ బాణుని
బాణములు) నేత్రే =2(కళ్ళు) (సంఖ్యా గణనములో 'భూత సంఖ్య ' అన్నది ఒక గణనా విధానము.)
మిగిలినది మరోమారు.........
ఆది శంకరులవారి కా(చివరి భాగము)లనిర్ధారణ - 3 వ భాగము 

 .ఆది శంకరులవారి కాలనిర్ధారణజ 1. పైనతెలిపిన శంకరుల జనన కాలము ఆ దినమున నాటి పంచాంగము ప్రకారమూ గ్రహగతి సరిపోవుచున్నది .
2. 'పతంజలి చరిత్రఅన్న గ్రంథమాధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ. పూ.493 గా నిర్ధారింపబడినది. శృంగేరి పీఠాధిపతులైన అభినవ విరూపాక్ష స్వాములవారు నిర్ణయించడము విశేషము. కావున ఇది కూడా శంకరులవారి జన్మ వత్సరమును బలపరచుచున్నది.
3. క్రీ.శ. 788 కన్నా ముందువారని చరిత్రకారులే ఒప్పుకొన్న మహేంద్ర వర్మ,భవభూతులవారి గ్రంథాలలో శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత ప్రసక్తి వుంది. అంటే ఆయన ఆ కాలానికి చాలా ముందుకాలం వాడని మంకు చెప్పకనే అర్థమౌతుంది కదా.
4. బ్ర.శ్రీ. కోట వెంకటాచలం గారి నేపాల రాజుల వంశ చరిత్రలో శంకరులువృష దేవ వర్మ నేపాలును పరిపాలించే కాలంలో ఆ దెస పర్యటన చేసినట్లు చెప్పబడింది. ఆ రాజు పరిపాలనా కాలము కలి శకం 2555-2615 అని చారిత్రికులు నిర్ధారించినారని తెలియబరచి యున్నారు. అంటే ఆయన క్రీ. పూ. 547-487 కాలము వాడు . అంటే అప్పుడు కూడా శంకరుల వారు  క్రీ. పూ.509 - 477 మధ్యకాలము వాడే అని తెలియా వచ్చుచున్నది .
5.మాక్స్ ముల్లరు 'శంకర మందార సౌరభ మన్న గ్రంథమును పునాదిగా గైకొని శంకరులవారి జననము క్రీ.శ. 787-88 అని నిర్ధారించి యున్నారు. చిత్సుఖాచార్యులవారు రచించిన'బృహత్ శంకర విజయము'కంటే ఇది అధునాతనమైనది.పైగా  చిత్సుఖాచార్యులవారు శంకరులవారి సమకాలీనులు. ఆయన మాటను త్రోసిరాజని  'శంకర మందార సౌరభ మును గీటురాయిగా తీసుకొనుటెట్లు ?
6. డా. పోతక్ మొదలుగాగల కొంతమంది చరిత్రకారులు క్రీ.శ. 788 లో కంచి పీఠాధిపతియైన అభినవ శంకరులవారినిఆది శంకరులుగా భ్రమించి ఆదిశంకరులవారి కాలనిర్ణయము చేసినారు.
ఇన్ని సాక్ష్యాధారాలమధ్య శంకరులవారి కాలాన్ని పరిష్కరించుటవల్ల మనము పొందే లాభమేమి?
1.ఆ నాటి సాంఘీక ఆచార వ్యవహారాలూ తెలుసు కొనుట
2. వారి తదనంతరము దేశ కాల పరిస్థితిలను సమీక్షించుట
3. వారి తరువాత ఎందరు మహనీయులు ఉధ్భవించినారు మరియు వారి యోగదానము
4. వారి గోప్పదనములో అణు మాత్రమైనా మనము సాధింప ప్రయత్నించుట
5. వారి భాష్యముల,భాషణములద్వారా సచ్ఛీలత,తత్వ సాధనము మున్నగునవి గ్రహించి ప్రచలితము చేయుట మొదలగు వుపయోగము లేన్నోకలవు.
6.వాస్తవ కాలానికి మిధ్యా కాలానికి మధ్యన గల మహనీయులు మరుగై పోతారు.
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్I
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాంII
నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ ।
వ్యాసం శుకం గౌడపదం మహాన్తం గోవిన్దయోగీన్ద్రమథాస్య శిష్యమ్ ॥
 అంతటి మహనీయునికి ఆయన జయంతి సందర్భముగా నేను ఈ విధముగా నా భక్తిని చాటుకొనుచున్నాను. దీనిని చదివి మీరూ యధోచితముగా మీ భక్తినిమన పూర్వుల నిజ చరిత్రపై ఆసక్తినిఅట్టి పరిశోధనలపై అనురక్తినిఅందుకు తగిన శక్తిని అవసరమగు యుక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని వేడుకొంటారని నమ్ముతూ శెలవు తీసుకొంటాను.
స్వస్తి. 


Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి