కాళిదాసు విక్రమార్కుని కాలము
కాళిదాసు విక్రమార్కుని
కాలము
https://ajaraamarasukthi.blogspot.com/2024/10/blog-post_28.html
కాలిదాసులు ఇద్దరు. ఒకరో
విక్రమార్కుని కాలము వారయితే ఒకరు భోజరాజు కాలమువారు. విక్రముని కాలపు కాళిదాసు
జ్యోతిర్విదాభారణము కలుపుకొని అభిజ్ఞాన శాకుతలాది బహు గ్రంధ రచయిత, వేరొకరు
కాళికా వరప్రసాదులు. ఇపుడు విక్రముని కాలపు కాళిదాసును గూర్చి అతి క్లుప్తముగా తెలుసుకొనే
ప్రయత్నమూ చేయుచున్నాము.
శ్లో|| ధన్వంతరి, క్షపణ కామరసింహ,శంకు, బేతాళ భట్ట, ఘటఖర్ప, కాళిదాసాః|,
ఖ్యాతో వరాహమిహిరో
నృపతేస్సభాయాం, రత్నానివై వరరుచిర్నవ
విక్రమస్య|| "
ఈ శ్లోకమునందు చెప్పబడిన
ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళభట్టు, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు మరియు వరరుచి
అను తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని ప్రసిద్ధి చెంది
ఉన్నారు.
వర్షే సింధుర దర్శనాంబర
గుణైర్యాతే కలౌ సంస్థితేl
మాసే మాధవ సంజ్ఞితేsత్రవిహితో గ్రంధక్రియోపక్రమఃll
సింధూర అంటే ఏనుగు అంటే
అష్టదిగ్గజములు అంటే 8 దర్శన అంటే దర్శనములు అవి షట్
దర్శ నములు అంటే 6 \, అంబర అంటే ఆకాశము. ఆకాశం
గగనం శూన్యం అంటే 0 గుణైః అనగా త్రిగుణములు
అనగా 3.కలౌ సంస్థితే అనగా కలియుగము
ప్రారంభమయినది మొదలుకొని అనిఅర్థము. మనము సంఖ్యాగణన 'సంఖ్యానాం వామతొగతిః' అన్న సూత్రము ప్రకారము మనము
8603ను 3068గా చదువవలసియుంటుంది. అంటే
ఆ మహాకవి తన జ్యోతిర్విదాభరణమును కలియుగము ప్రారంభమైన తరువాత 3068 సంవత్సరమున వ్రాసినారు.
పైరెండు శ్లోకాలు
అన్వయించితే విక్రమార్కుని కాలము మనకు కొంతవరకూ తెలియవస్తింది. ఈ విషయమై విపులముగా
వేరొక వ్యాసములో వ్రాసినాను.
స్వస్తి.
Comments
Post a Comment