శరభంగ సుతీక్ష్ణ మహర్షులు

 

 శరభంగ సుతీక్ష్ణ మహర్షులు 

https://ajaraamarasukthi.blogspot.com/2024/10/blog-post.html

శరభంగ మహర్షి

 శుద్దబ్రహ్మ పరాత్పర రాం' అన్న రామనామావళి చదివే వారికి  'శరభంగ సుతీక్ష్ణ మహర్షులు' గుర్తుంటారు. ఎందుకంటే ఆ నామావలిలో   'శరభంగ సుతీక్ష్ణార్చిత  రాం' అన్న నామము కూడా వస్తుంది. ఈ మహర్షులనుగూర్చి మనకు రామాయణము ద్వారా తెలియ వస్తుంది. రామాయణము ద్వారా నాకు తెలిసిన మేరకు మీకు తెలియజేస్తాను.చాలామందికి వీరినిగూర్చి తెలిసియుండే అవకాశము తక్కువ కావున నేను ఈ ప్రయత్నమునకు గడంగినాను, 

 

సీతారమ లక్ష్మణులు అడవులలో ప్రయాణం చేస్తూ శరభంగ మగర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్ళకు ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది.రథము అంతా మెరిసిపోతుంది. ఆ రథమునకు చుట్టూ  కొన్ని వందల మంది దేవతా సైనికులు నిలబడి ఉన్నారు. వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని, దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనము పక్కన వింజామరలు పట్టుకొని అప్సరసలు నిలబడి ఉన్నారు. కాని ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తి, శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు.  వేరేవరోకాడు ఆయన ఇంద్రుడే!

ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి "లక్ష్మణా!మనము వేద మంత్రములలో, ఇంద్రుని రథమునకు హరితాశ్వములు అనగా ఆకుపచ్చ గుర్రములు పూన్చియున్తారని చదినాముకదా, ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు, అని అన్నాడు. 

అలా లోపలికి వస్తున్న రాముని ఇంద్రుడు చూసి, శరభంగుడితో ఎదోచేప్పి అంతర్దానమందినాడు.

లోనికి వచ్చిన వ్యక్తిని రామునిగా గుర్తించి శరభంగ  మహర్షి ఈ విధముగా అన్నాడు:"రామా! నాకు తెలుసు నీవు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్ని పొందగాలిగినాను, అందుకని నన్ను తీసుకు వెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి, నన్ను స్వర్గమునకు రమ్మన్నాడు. కాని నేను, నాకు ప్రియమైన అతిథి రాబోవుచున్నాడు. అతనికి ఆతిధ్యమునిచ్చి నా జన్మము ధాన్యము చేసుకోన్నతరువాట వస్తాను, అన్నాను. రామా! నేను నా తపఃశక్తితో సాధించిన లోకాలని నీకు ధారపోసేస్తాను, యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు" అని శరభంగుడు అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు "మహానుభావా! మీరు తపస్సు చేసి నాకు ధారపొయ్యడమేమిటి.నేను పితృవాక్య పరిపాలనాబద్ధుడను. నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు" అన్నాడు. రాముని దీక్షాదక్షతకు సంతోషించిన శరభంగుడు ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ మహర్షి ఆశ్రమము ఉన్నది, నీవు ఆయనని దర్శించు, నీ కోరిక నేరవేరగలదు, అనిచెప్పి   జర్జరీభూతమయిన  (ముసలిదయి ముడతలు పడిపోయిన)తన శరీరమును అగ్నికి ఆహుతి చేసినాడు.

ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయినారు. హోమాగ్నికి ఆహుతియైన  శరభంగుని పార్థివ శరీరము కౌమారంతో ఉన్న శరీరముగా మారి  స్వర్గాదిలోకములను దాటి   బ్రహ్మలోకమునాకు చేరినాడు.మన్మథుని అరవిందము, అశోకము, చూతము అనగా మామిడి, నవ మల్లికలు నీలోత్పలము అనగా నల్ల కలువలను పంచ పుష్పబానముల నిర్వీర్యముచేసి మన్మథుని జయించిన మహానుభావుడగుటచే ఆయన శర అనగా (మన్మధ) బాణములను భంగము చేసి అనగా కామ మోహాడులకు లొంగక శరభంగుడైనాడు.

మరోమారు సుతీక్ష్ణ మహర్షిని గూర్చి.....

సుతీక్ష్ణ మహర్షి

రాముడు మానవ రూపంలో ఉన్నందున స్వర్గస్థులను కలవడానికి ఇష్టపడలేదు మరియు ఇంద్రుడిని కలవడానికి ఆసక్తి చూపలేదు. ఇంద్రుడు బయలుదేరిన తర్వాత, రాముడు శరభంగ మహర్షిని కలవడానికి లోపలికి వెళ్లి ఆయన మాటమేరకు  ముగ్గురూ పశ్చిమ దిశ వైపు తమ ప్రయాణాన్నిసుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం వైపు  కొనసాగింగించినారు. వాల్మీకి మహర్షి ఈ ప్రయాణాన్ని అందంగా ఒక శ్లోకములో వివరించినాడు.

"ఇమం మందాకినీ రామ ప్రతిస్రోతం  అనుగ్రజా!"

 

ఇక్కడ,శరభంగ మహర్షి “ప్రతిస్రోతం అనుగ్రజా!” అని ఆసక్తికరంగా చెప్పారు. "ప్రతిస్రోతస్" అంటే "మందాకినీ నది ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళడం" అని అర్థం . ఆ విధంగా, శరభంగ మహర్షి రామునితో ఇలా అంటాడు, “ఈ మందాకినీ నది వెంట, దాని ప్రవాహానికి ఎదురుగా వెళితే, మీరు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు!”  ఇప్పుడు, మనం ఈ ప్రదేశాన్ని ఆధునిక భారతీయ భౌగోళిక శాస్త్రంలో గుర్తించినట్లయితే, మందాకిని నది పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుంది అని గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది . ఇప్పుడు పై శ్లోకం ప్రకారం, మనం దాని ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్లవలసి వస్తే, మనం ఆవిధంగా పశ్చిమ దిశ వైపు వెళ్లాలి. అయితే కొంత దూరం తర్వాత నది మలుపు తిరిగి కొంతసేపటికి వ్యతిరేక (పశ్చిమ) దిశలో ప్రవహిస్తుంది.  అయితే, మనం ఇప్పుడు శ్లోకాన్ని నిశితంగా పరిశీలిస్తే, శరభంగమహర్షి మనం పశ్చిమ దిశ వైపు వెళ్లాలని సరిగ్గా చెప్పలేదు కానీ ది తన దిశను పశ్చిమంగా మార్చుకునే ప్రదేశానికి వెళ్ళాలి అని అతను చెప్పినాడు! సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమము యొక్క ఖచ్చితమైన ఉనికి ఏమిటంటే, మందాకినీ నది పశ్చిమ దిశ వైపు తన మార్గాన్ని మార్చుకొనే చోటికి, మేము  నాలుగు “యోజనాలు” దూరం ప్రయాణించినాము, (యోజనమనునది పూర్వము తరచుగా ఉపయోగించే కొలత.

 

ఆ విధంగా, రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి ఋషిసత్తముని సూచనల మేరకు నడుచుకుంటూ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు.

 

తథాస్త్వాం శరణార్థాంచ శరణ్యం సముపస్థితాః!

 

పరిపాలయనో రామ వర్ధ్యమానం నిశాచరైహి!!”

 

ఆ విధంగా, రాముడు సుతీక్ష్ణ మహర్షికి తన నివాళులర్పిస్తాడు మరియు అతనితో కొంతసమయము సంభాషిస్తాడు. సంభాషణా సమయములో రాముడు సుతీక్ష్ణ మహర్షిని తను, భార్య మరియు సోదరుడితో కలిసి ఉండటానికి మంచి స్థలం ఉందా అని అడుగుతాడు. దానికి సుతీక్ష్ణ మహర్షి, “రామా! ఈ స్థలం చుట్టూ మీకు హాని కలిగించే అనేక అడవి జంతువులు ఉన్నాయి! మీరు ఇక్కడ ఉండాలనుకుంటే, మీరు వాటిని వేటాడుతూ చంపవలసియుంటుంది”.తమ నివాసము కొరకు  అమాయక జంతువులను చంపుట రాముడు ఆసక్తిప్రకటించనందున, రాముడు ప్రత్యామ్నాయ పరిష్కారము కొరకు అడుగుతాడు. అంత సుతీక్ష్ణ మహర్షి తన తపస్సు శక్తితో పంచవటి యందు,ఒక ప్రదేశమును చూపించి దాని చుట్టూ ఒక భారీ “ఆశ్రమ మండలం” (వివిధ మహర్షుల  ఆశ్రమాల సమూహం) చూపించి , రాముని ఆ స్థలము అమిత యోగ్యమైనదని తెలిపి అచట తమ అరణ్యవాస కాలమును గడపమని ఆదేశించుతాడు.

 

ఆ విధముగా, శ్రీరాముడు మాత సీత మరియు లక్ష్మణులతో కలిసి ఆ ప్రాంతమున బస ఏర్పరచుకొని చుట్టూ ఉన్న ప్రతి ఆశ్రమానికి వెళ్లి ఆయా ఋషిగణములతో కలిసి ధర్మసూక్ష్మములను తెలుసుకొనుచూ  ఇంచుమించు పది సంవత్సరముల కాలమును గడిపినాడు.

ఇదీ రామాయణాంతర్గత శరభంగ సుతీక్ష్ణ మహర్షుల వృత్తాంతము.

స్వస్తి.

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి