ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయము-ముంబాయి
ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయము-ముంబాయి
https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_24.html
మహారాష్ట్ర లోని ముంబాయి నగరమందలి ప్రభావతి ప్రాంతంలో సుప్రసిద్ధమగు ఈ దేవాలయము ప్రతిష్ఠితమైయున్నది. దీనికి రెండు శతాబ్దాల చరిత్ర కలదు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు అని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. ఈ దేవాలయము నవంబరు 19,1801 లో లక్ష్మణ్ వితు మరియు దేవూభాయ్ పాటిల్ చే నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన దేవాలయము. ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తుల తాకిడి విపరీతముగా ఉంటుంది. మంగళ వారం నాడు సుమారు డెబ్బై వేలమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి వార్డుషి (Bank)లలో నిధులుగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిక్షేపణము చేయబడి ఉన్నాయి. ప్రతి ఏడు కానుకలుగా పది కోట్లకు పైగా కానుకల రూపములో వస్తూనే ఉంటుంది. ఈ ఆలయ సంపద విలువ మూడు వందల యాబై కోట్ల రూపాయలు పైగానే ఉంది. 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాలక్రమములో ఆరు అంతస్తులతో ఉంది. ఆలయ శిఖర గోపురానికి బంగారు తాపడం చేయించినారు. ఆగ్రిసమజ్ కు చెందిన దూబె పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని కట్టించిన ఇరువురు భక్తులలోనొకరు. పిల్లలు కలగని మహిళలు ఈ స్వామి వారిని దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసము. ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వుండడము ఈ ఆలయము యొక్క త్యేకత. ఒకచేతిలో కమలము, ఒక చేతిలో పరుశువు, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో కుడుము ఉన్నాయి. ప్రముఖ వ్వాపార వేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండటంతో ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఈ దేవాలయం గోపురం లోపలి భాగంలోని పైకప్పు బంగారంతో తాపడం జరిగింది.
చరిత్ర
ఈ దేవాలయం నబంబరు 19 1801 న నిర్మించబడింది. దీని వాస్తవ నిర్మాణం చాలా చిన్నదిగా 3.6మీ x 3.6 మీ కొలతలుగా ఉన్న చతురస్రాకార స్థలంలో శిఖరాన్ని కలిగి యుండే నిర్మాణంగా యుండెడిది. ఈ దేవాలయMము లణ్ వితుల్ పాటిల్ అనే సంవేదకునిచే 9ontractor)నిర్మింపబడినది.
స్వస్తి.
Comments
Post a Comment