మోహము – ధర్మమార్గము
మోహము – ధర్మమార్గము
https://ajaraamarasukthi.blogspot.com/2024/05/blog-post_22.html
కాశీలో గంగానదీ
తీరమున, మణికర్ణికా
ఘట్టము ఒడ్డున ఉదాసీనముగా ఒక వ్యక్తి ఉండేవాడు.
ఒంటిపై చొక్కా ఉండేదికాదు. అందుచే మేనిపై ఉన్న యజ్ఞోపవీతము అగుపించేది. అదే దారిన ఒక
పండితుడు ప్రతిరోజూ
అతనిని చూస్తూ
పోయేవాడు. ఎక్కడికీ, ఆటను ఉత్కంఠత భరించలేక అతనిని సంస్కృతములో “ఎందుకు ఏ అనుష్ఠానము చేసుకోకుండా
అట్లు కూరుచొనియుంటావు” అని అడిగినాడు. అందుకు జవాబుగా ఆ వేదాంతనిధి ఈ విధముగా
సంస్కృత శ్లోకరూపములో జవాబు చెప్పినాడు.
మృతా మొహమాయీ
మాతా జాతస్య పుత్ర వ్యామోహయఃl
సూతకం వర్తతే
నిత్యం కథం సద్యోపాసనే ll
నాలో అనుదినమూ
మొహమమయమైన తల్లి మరణింతూ వుంది. వ్యామోహమనే పుత్రుడు ఉదయించుచున్నాడు. ఈవిధముగా
ప్రతిదినమూ సూతకముతో సతమముచున్న నేను జపతపాలకు అర్హుడను కాలేను కదా!
అన్నాడు. ఆమాటతో ఆపండితుడు
ఆ వేదాంతనిధి పాదాలకు దండప్రణామము ఆచరించి ‘మహానుభావా! అనుష్ఠానమునకన్న
ముఖ్యమయిన స్వార్థము ఆశలను జయించుట అన్నది సాధించి అనుష్ఠానమునకు గడన్గుతాను అని
చెప్పి శెలవు తీసుకొన్నాడు.
స్వస్తి.
Comments
Post a Comment