చిదంబర రహస్యం

 

చిదంబర రహస్యం

https://ajaraamarasukthi.blogspot.com/2023/10/blog-post.html

చిదంబర రహస్యమును గురించి చెప్పడం ప్రారంభించే ముందు ‘సత్’ మరియు ‘చిత్’ ను గూర్చి చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. ‘సత్’ అంటే ఉన్నది. ‘చిత్’ అనేది స్వయం ప్రకాశించేది. ఒక ఖగోళ వాస్తవికత ఏమిటంటే సూర్యుడు కూడా వేరొక సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. ఈ విషయము ప్రస్ఫుటముగా మనము ‘ఆదిత్యో జ్యోతిరాదిత్యః అన్న శ్లోకములో చూడవచ్చు.  కాబట్టి స్వయం ప్రకాశవంతంగా వ్యక్తమయ్యేది ‘చిత్’. అంటే ఆ జ్యోతిరాదిత్యుడే! ఆయనది నిశ్చల తత్వము. మొదట ‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్న అద్వైత తత్వము మనము గుర్తుంచుకోవలసినది.

సంస్కృతంలో ‘అంబరము’ అన్న మాటకు  1. ఆకాశం 2. వస్త్రం అని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను చుట్టుకోవడానికి ఆకాశాన్ని తన వస్త్రంగా కలిగి ఉన్నాడు. ‘ఆకాశం’ అంటే ‘శూన్యం’ అంటే శూన్యం అని శాస్త్రం చెబుతోంది. అప్పుడు ఆయన మొత్తము అనంతమైన ఆకాశమును వస్త్రమును కలిగియున్నాడు. అనగా ఆయన దిగంబరుడు, అంటే ఆయన దిక్కులనే విస్తరించిన  అంబరమును వస్త్రముగా ధరించినాడు అని గానీ , లేక ఆయనకు వస్త్రమే అవసరము లేనివాడని గానీ అర్థము చేసుకొనవచ్చును.

ఇప్పుడు చిదంబరంలో ప్రబలంగా ఉన్న ఆ 'రహస్యం' ఏమిటో తెలుసుకుందాం.

పురాతన కాలం నుండి, ఇది శివుడు మరియు పార్వతి ఉన్న ప్రదేశమని నమ్ముతారు, కానీ చర్మ చక్షువులకు వారి దివ్య దర్శనము కలుగదు. విశ్వనాథుడైన ఆ నటరాజు చిదంబరములోని ఆలయంలోవిగ్రహ రూపములో స్వామి వ్యక్తమగుట ఆయన లీలలోని ఒక పార్శ్వము మాత్రమె! రెండవదే చిదంబర రహస్యము. చిదంబర రహస్యము ఒక తెర (మాయ)కు మరొక వైపు ఉంటుంది, ఇది దాచడానికి ఉద్దేశించబడింది. ఏది దాచాబడుచున్నది? దైనందిన ప్రత్యేక పూజల కోసం తెర (లేదా మాయ) తెరిచినప్పుడు మాత్రమే చిదంబర రహస్యం ఏమిటి అన్నది తెలుసుకొన సాధ్యమవుతుంది. చిదంబర రహస్యము యొక్క దర్శనమును పొందే అవకాశం ఉన్న వ్యక్తులు కేవలం బంగారు బిల్వ దళములను అనగా మారేడు దళములు మాత్రమే అక్కడ చూడగలరు. ఇది వారి ముందు శివుడు మరియు పార్వతి ఉనికిని సూచిస్తుంది. సాధుజనులగు భక్తులు  దేవతలను వారి భౌతిక రూపంలో చూడగలరని నమ్ముతారు కానీ అధికారికంగా ఆధారాలేవీ  అగుపించలేదు. దానికి సాధన అవసరం, మరియు అలాంటి వ్యక్తులు భగవంతుని తాము ఉన్న చోటే దర్శించగలరు.

పైన వివరించిన విధంగా ఒక నిర్దుష్టమైన సమయములో తెరను తొలగించినపుడు రహస్యాన్ని వీక్షించడానికి వీలు కలుగుతుంది. ఆ విధముగా చేయట యొక్క అసలు ప్రాముఖ్యత ఏమిటంటే, "మాయ" అనే తెర తొలగిపోయినప్పుడు, ఒక వ్యక్తి తన నిజస్వరూపాన్ని చూడగలడు. మరియు మాయ అన్న తెరను తాను తొలగించి చూడటం అనేది తన రహస్యాన్ని స్వయంగా తానే చూసుకోవడం కదా! పురాణాల ప్రకారం, "చిదంబర రహస్యం" ఎప్పటికీ బహిర్గతం చేయబడదు, ఎందుకంటే "మాయ" అన్న తెరను అర్చకుడు తీసివేసినంత మాత్రాన ఆరహ్స్యము చూసేవారికి బోధ పడదు.  ఆ రహస్యమును అర్థము చేసుకోనవలెనంటే తనలోనికి తానూ చూసుకొనే యోగ్యతా తనకు కలిగినపుడే అది వీలౌతుంది. శరీరములో గుండెకు దగ్గరగా వడ్లగింజ ముళ్ళు ప్రమానములో ఒక నీలి జ్యోతి వెలుగుతూనే ఉందేవరకూ మనమనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఆజ్యోతి కొడెక్కితే మనకు భావభంధము తీరినట్లే! ఆ జ్యోటి మధ్యలో అణురూపములో పరమాత్మ విలసిల్లు చున్నాడు. ‘ .దీపముండగనే ఇల్లు చక్కబెట్టుకొనవలె’ నన్న సామెత ఒకటుంది. మనము దేనియందు నివసిన్చుచున్నామో  అది మాత్రమేకాదు ఒళ్ళు. మనదేహమును కూడా ఇల్లనియే శాస్త్రములు తెలియజేసినాయి. ఆయింటిలో ఉండే దీపము భగవంతుని నివాసము. కావున ఆదీపము ఉండేలోపుననే నీ మనస్సును ఐహిక విషయ వాంఛల పైనుండి ఆధ్యాత్మిక వాంఛలపై మరలించి భగవద్ సాయుజ్యమును సంపాదించమని చెబుతూవుంది ఆ సామెత.

ఇక చిదంబరమును కనక మహాసభయని తెలుగు లోనూ  ‘పొన్నంబళం’ అని అరవం లోనూ పిలుస్తారు, ఇది తమిళనాడులోని శివ భక్తులకు ప్రసిద్ధి చెందిన ఆలయమన్నది అందరికీ తెలిసిన విషయమే! ఇక అసలు విషయమునకు వద్దాము.  

8 సంవత్సరాల ‘శోధన మరియు విస్తరణ (R & D) తర్వాత, పాశ్చాత్య శాస్త్రవేత్తలు నటరాజ విగ్రహము యొక్క బొటనవేలు వద్ద ప్రపంచ అయస్కాంత భూమధ్యరేఖ యొక్క కేంద్రబిందువు అని నిరూపించినారు.

ప్రాచీన తమిళ పండితుడు తిరుమూలర్ ఐదు వేల సంవత్సరాల క్రితం, (ఇది ఒక అంచనా మాత్రమే!, వాస్తము నాకు తెలియదు) దీనిని వెలుగులోకి తెచ్చినాడు! ఆయన గ్రంథం తిరుమందిరం (తిరుమంత్రం నమశ్శివాయ) (తమిళములో మంత్రము అన్న మాటను ‘మందిరం అని పలుకుతారు) యావత్ ప్రపంచానికి అద్భుతమైన చిదంబర క్షేత్ర శాస్త్రీయ మార్గదర్శిగా పరిగణించబడుతుంది. ఆయన అధ్యయనములను అర్థం సంపూర్ణముగా అర్థము చేసుకొనుటకు, మనకు 100 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఇపుడు చిదంబరం దేవాలయమును గూర్చి ఆ మహానుభావుని దీపపు వెలుతురులో క్లుప్తముగా తెలుసుకుందాము.

కింది లక్షణాలను జాగ్రత్తగా పాటిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు:

1) ఈ ఆలయం ప్రపంచంలోని అయస్కాంత భూమధ్యరేఖ యొక్క కేంద్ర బిందువు.

2) కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు అనేక పురాతన శివాలయాలు అనగా కాళేశ్వరము, శ్రీ కాళహస్తి, కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయము, చిదంబరంలోని తిల్లై నటరాజ ఆలయం 79° E 41'54" రేఖాంశం చుట్టూ భౌగోళిక సరళ రేఖలో ఉన్నాయి.

శ్రీకాళహతి – శ్రీకాళహస్తీశ్వర దేవాలయం (వాయు లింగము)(13.749802, 79.698410) కాంచీపురం – ఏకాంబరేశ్వర దేవాలయం(పృథ్వీ లింగము)  (12.847604, 79.699798) చిదంబరం – నటరాజ ఆలయం (ఆకాశ లింగము)(11.399596, 79359.69)

మూలం: https://www.booksfact.com/mysteries/ancient-siva-temples-straight-line.html .

"పంచ భూత" (5 మూలకాలు అనగా పృథ్వీ (భూమి) ఆపస్ (నీరు) తేజస్ (కాంతి) వాయు(గాలి) ఆకాశాలు (ఆకాశం) అంటే 5 దేవాలయాలలో, చిదంబరం నటరాజు ఆకాశాన్ని సూచిస్తుంది.

శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరుడు గాలిని సూచిస్తుంది.

కంచి ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తుంది.

3 ఆలయాలు 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశంలో సరళ రేఖలో ఉన్నాయి. దీన్ని Google ఉపయోగించి ధృవీకరించవచ్చు. ఆశ్చర్యపరిచే వాస్తవం మరియు ఖగోళ అద్భుతం!

3) చిదంబరము లోని దేవాలయము మానవుని శరీరాకృతిని ప్రతిబిమ్బించుతుంది. ముఖ్యముగా మానవుని నవరంధ్రాలను ప్రతిబిమ్బించుతుంది. 'తోలు తిత్తి ఇది' త్రోవలు తొమ్మిది తుస్సుమనుట ఖాయం’ అనికదా మన వేదాంత తత్వము.

4) ఆలయపు పైకప్పు 21600 బంగారు రేకులతో తయారు చేయబడింది, ఇది మానవుడు ప్రతిరోజూ తీసుకునే 21600 శ్వాసలను సూచిస్తుంది. (15 x 60 x 24 = 21600) సాధారణంగా మానవుడు ప్రతి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాడు.

5) 21600 బంగారు రేకులు 72000 బంగారు మేకులను ఉపయోగించి గోపురంపై అమర్చబడ్డాయి, ఇవి మానవ శరీరంలోని మొత్తం నాడుల (నరాల) సంఖ్యను సూచిస్తాయి. ఈ నాడులు కనిపించని కొన్ని శరీర భాగాలకు శక్తిని బదిలీ చేస్తాయి.

6) చిదంబరంలోని తిరుమూలర్ (మూలవిరాట్) సదాశివాన్ని సూచిస్తుంది, అంటే సదానందం తన భార్యతో విశ్వ నృత్యాన్ని సూచిస్తాడు మరియు చిదంబరం వద్ద ఇది 'ఆనంద తాండవం' కాబట్టి సదానందం. అది (ప్రకృతి-పురుష) అర్ధనారీశ్వర తత్వం.

7) "పొన్నంబళం" అనేది కనక సభ మరియు ఇక్కడ శివుడిని కనక సభాపతి అని పిలుస్తారు. ఆయన కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉన్నాడని గమనించితే మనకు తెలియవస్తుంది. ఇది మన హృదయాన్ని సూచిస్తుంది. దీనిని చేరుకోవడానికి, మనం "పంచాక్షర సోపానములు" అని పిలువబడే 5 మెట్లు ఎక్కాలి. తమిళంలో "పంచాక్షర పడి అంటారు.

"శి, , , , మ" అనేవి 5 పంచాక్షరములు. ఈ ఐదు కలిసినదే ‘పంచాక్షర మంత్రము.

4 వేదాలను సూచించే 4 స్తంభాలు కనక సభకు ఆధారభూతముగా ఉన్నాయి.

పురాణాలలో ఈ క్రింది విధంగా ఐదు చిడంబరేశ్వరుని నృత్య మంటపాలుగా  పేర్కొన బడినాయి.  అవి:

 దక్షిణ ఆరణ్యేశ్వర ఆలయంలోని(తిరువళంగాడు) రత్న సభలో కాళీ తాండవము , చిదంబర నటరాజ ఆలయంలోని కనక సభలో ఆనంద తాండవము , మధుర మీనాక్షి దేవి ఆలయంలోని రజత సభలో సంధ్యా తాండవము , తిరునెల్వేలి (వేణు వనము) లోని నెల్లైయప్పర్ ఆలయంలోని తామ్ర సభలో ముని తాండవము మరియు   కుర్తాళ నాథ  ఆలయములోని చిత్ర సభలో త్రిపుర తాండవము అని పిలువబడుతాయి. ఈ క్రింది విషయమునుకూడా గమనించండి.

చిదంబరం ఆలయంలోని ఐదు మందిరాలను చిత్ర సభై (గర్భగృహం), పోర్ సభై (గర్భగృహము ముందు ఉన్న మండపము), నిరుత సభై (రథాకృతిలో ఉన్న మండపము), దేవ సభ (అన్ని ఉత్సవ దేవతలు ఉన్న మండపము) మరియు రాజ సభ (వెయ్యి స్తంభాలమండపము) అని పిలువబడుతాయి.

8) పొన్నంబలం (కనకసభ)లో 28 స్తంభాలు ఉన్నాయి. 28 ‘ఆగమాలు’ అంటే శివుడిని ఆరాధించే 28 పద్ధతులు.

ఆగమ గ్రంథాలు (తమిళం) విశ్వోద్భవ శాస్త్రం, జ్ఞానశాస్త్రం మరియు తాత్విక సిద్ధాంతాలు, ధ్యానం మరియు అభ్యాసాలపై నియమాలు, నాలుగు రకాల యోగా, మంత్రాలు, ఆలయ నిర్మాణం, దేవతా ఆరాధన మరియు ఆరు రెట్లు కోరికలను సాధించే మార్గాలను వివరిస్తాయి. 28 శైవ ఆగమాలు ఉన్నాయి కాబట్టి స్తంభాలు దానిని సూచిస్తాయి.

28 స్తంభాలు 64 కళలను సూచించే 64 +64 దూలములకు మద్దతునిస్తాయి. అడ్డముగా ఉన్న దంతెలు మానవ శరీరం అంతటా నడుస్తున్న రక్త నాళాలను సూచిస్తాయి.

9) బంగారు పైకప్పుపై ఉన్న 9 కలశాలు 9 రకాల శక్తి (నవ దుర్గ) లేదా శక్తులను సూచిస్తాయి.

అర్థ మంటపం వద్ద ఉన్న 6 స్తంభాలు 6 వేదాంగాలను సూచిస్తాయి. పక్కనే ఉన్న మంటపంలోని 18 స్తంభాలు 18 పురాణాలను సూచిస్తాయి.

10) నటరాజ నృత్యము విశ్వ నటనముగా వర్ణించబడింది. దానిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు:

‘క్వాంటం ఫీల్డ్’ సిద్ధాంతం ప్రకారం, సృష్టి మరియు ప్రళయ కాలపు నృత్యము సృష్టి యొక్క ఉనికికి ఆధారము. ప్రతి ఉప పరమాణు కణము శక్తి చలనము(మెరుపుతీగ వలె కదులుటచే దానిని తాండవముగా అభివర్ణించినారు. ఆధునిక భౌతిక శాస్త్రము దీనిని శక్తి(Power) నృత్యముగా కూడా అని వెల్లడించింది; సృష్టి మరియు ప్రళయము యొక్క స్పందన ప్రక్రియ. ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు, శివుడి నృత్యం ‘సబ్‌ అటామిక్’ పదార్థము యొక్క నృత్యము, ఇది అన్ని మరియు సకల సహజ దృగ్విషయాలకు ఆధారము.

మనము ఆసక్తిని కనబరిచితే మన పురాతన దేవాలయాలలో అనేక అద్భుతమైన విషయాలను చూడవచ్చు.దేనికైనా పట్టుదల మరియు సహనం ముఖ్యమైనది.

స్వస్తి.

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి