విద్యా వ్యవస్థ నాడు నేడు
విద్యా వ్యవస్థ నాడు నేడు - 2
నాడు గర్గి మైత్రేయి మొదలగు వేదపండితులు, భర్తలకే సమయోచిత సలహాలనోసగిన,
సీత, తార, ద్రౌపది మొదలైన విదుషీమణులు, ఆధునిక యుగమందున ఝాన్సీ లక్ష్మి,
నీచముగా మీనా బజారులో ప్రవర్తించ బోయిన అక్బరును పడవేసి కంఠముపై కత్తి
నిలిపిన రాజపుత్ర యువరాణి కిరణ్ దేవి, రాణీ రుద్రమ దేవి వంటి వీర వనితలు,
తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల ముద్దుఫళని, రంగాజమ్మ వంటి విదుషీమణులు, MS
సుబ్బలక్ష్మి, DK పట్టమ్మాళ్, వసంత కోకిలం, ML వసంత కుమారి వంటి సంగీత విద్వన్
మణులు కలిగిన ఈ దేశములో స్త్రీ స్వాతంత్ర్యము లేదా, స్త్రీలు విద్యావంతులు కాదా! ఒక
నాటి సినిమాలలో లలిత పద్మిని రాగిణి అన్న తిరువాన్కూర్ సిస్టర్స్, వైజయంతి మాల,
కమలా లక్ష్మణ్, మొదలగువారంతా శాస్త్రీయ నృత్యములో నిష్ణాతులు. మరి మన స్త్రీలను
ఉద్ధరిస్తున్నట్లు కుహనా సంస్కరణ వాదుల ప్రేలాపనలు నిజముగా అర్థవంతమైనవేనా!
మధ్య తరగతి కుటుంబీకులలో కూడా ఎందఱో అమ్మ గారు, అవ్వ గారు B.A, M.A. లు
చదువక పోయినా ఎన్నో నీతికథలు, నియమ నిబంధనలు పిల్లలకు నేర్పించేవారు.
నేడవి కనుమరుగై పోయినాయి.
విద్యా శిక్షణ నాడు: చదువుకు వర్ణ విచక్షణ లేదు. స్త్రీ పురుష భేదము గురుకులములలో
లేదు. విద్యతో బాటు ఋజు ప్రవర్తన, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కట్టుబాట్లు
బాధ్యత, సహనము సొశీల్యము, తమ తమ వృత్తులకు సంబంధించిన మెళకువలు నేర్పే
వారు. విద్యలో గణితము అందరూ నేర్చుకోనవాల్సిందే! ఖగోళము, గ్రహ చారము,
నక్షత్ర గమనము, జంతు వృక్ష భౌతిక శాస్త్రములు వారి వారి పరిమితులకు
అనుగుణముగా నేర్పించేవారు. విద్యార్థుల మధ్య సహవాసమునకు వర్ణములు ఏనాడూ
ఆటంకములు కాలేదు. బలరామ కృష్ణ సుధాముల మైత్రియే ఇందుకు తార్కాణము. ఇక
పరిక్షలు,
పిండి రుబ్బినట్లు విషయమును కంఠస్తము చేసి కాగితములపై కక్కే విధానము
నాడు లేదు. ఆయా విభాగములకు సంబంధించిన ముఖ్య విషయములను చీటీలవంటి
కాగితములలో వ్రాసి చుట్ట చుట్టి ఘటిక (చిన్న మట్టి పాత్ర) లో ఉంచి ఆయా
విద్యార్థులను అందునుండి ఒక చుట్ట తీసి అందు తెలిపిన విషయమును గూర్చి
వివరణాత్మకముగా అడిగేవారు. అన్ని విభాగాములకు అదే పద్ధతి.
ఇంకొక అతి ముఖ్యమైన విషయము ఏమిటంటే ఈ గురుకులాలలో 300 మొదలుకొని 30,000 వేళా
మంది విద్యార్థులు కూడా వుండేవారట. వెంటనే మనకు గుర్తుకొచ్చేది
Section కు 20 మంది ఉండే Class Room. ఆవెంటనే మనము అనబోయేది ఇదంతా
Trash అని.
కానీ నాడు ఇంత మందిని ఏవిధముగా నియంత్రించి చదువు చెప్పేవారో
తెలుసుకోన్నారంటే మీరు నిర్ఘాంతపోక తప్పదు. 30 వేల విద్యార్థులున్న
గురుకులములో 100 విభాగాలున్నాయనుకొందాము. అప్పుడు తరగతికి 300 మంది
అవుతారు. ఆకాలములో రాజులు, ప్రముఖులైన ధనవంతులు ఎంతో వితరణతో
భూదానము చేసేవారు ఆ విధముగా ఆ గురుకులమునకు ఒక 100 ఎకరముల స్థలము
ఉండినదని అనుకొందాము. దానిని చాయా ఫల పుష్పములొసగు మనోహర వనముగా
తీర్చిదిద్దుట, అచ్చటి అధ్యాపక ఆచార్య గురు బృందముల పర్యవేక్షణలో, విద్యార్థుల పని.
కాబట్టి ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణములో విద్యార్థులు చదివేవారో గమనించండి.
అసలు ఆచార్యుడు అధ్యాపకుడు గురువు అన్న మాటలకు వ్యుత్పత్తి అర్థములను ఒకసారి
చూద్దాము.
నిరుక్తమునకు భాష్యకారుడగు యాస్కాచార్యులవారు 'ఆచార్య' అన్న పదమునకు అర్థమును ఈ
విధముగా తెలియజేసినారు.
1. ఆచరతి ఇతి ఆచార్యః అంటే తసను ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు.
2. ఆచారం గ్రాహయతి ఇతి ఆచార్యః అంటే ఆచరించ వలసిన విధివిధానమును
ఆచరింపజేయించేవాడు.
3. అచినోతి అర్ధాన్ ఇతి ఆచార్యః అంటే నిరంతరమూ తన శిష్యులకు తగు విషయ
వివరములను సేకరించి వారికి అందించేవాడు.
ఇక అధ్యాపకుడు అన్న మాటకు అర్థమేమిటో చూద్దాము. 'ఆపక' అన్న మాటకు అర్థము
తీసుకు పోవువాడు అని. 'అధి' అంటే విశిష్ఠ స్థానము అని అర్థము. కావున అధ్యాపకుడు
అంటే తన శిష్యులను ఒక విశిష్ఠ స్థానమునకు తీసుకుపోవువాడు అని అర్థము. అంటే
నిర్ధారిత లక్ష్యమునకు తన చాత్రులను చేర్చువాడు అని అర్థము. ఆంగ్ల పదములలో
ఇటువంటి వ్యుత్పత్తులకు తావు లేదు.
ఇక గురువు అన్న శబ్దమునకు అర్థమును ఒకసారి విశ్లేషించుకొందాము. గురుత్వము
అన్నమాటకు సాంద్రత (Gravity) అన్న ఒక అర్థము వున్నది. సులభమయిన ఉదాహరణ
ఏమిటంటే ఒక బియ్యపుగింజ సాంద్రత ఎక్కువగా కలిగి ఉంటుంది కానీ దానినుండి
తయారయిన పేలము చాలా తేలికగా ఉంటుంది. అంటే బియ్యపుగింజ లోని అణువులు
ఎంతో దగ్గరగా చిక్కగా వుంటాయి అదే పెలము లో చాలా వదులుగా అవి ఉంటాయి.
కావున గురువు అంటే అనేక విషయములను తనయందు కలిగిన ఒక సముద్రము
వంటివాడు. విద్యార్థికి కలుగు ఏవిధమగు కష్టమును కూడా ఆతడు తీర్చే బాధ్యతను
తీసుకొంటాడు. అందువల్ల ఆతను అసలు విద్యార్థికి గరిమనాభి(Centre of Gravity)
అవుతాడు. శాస్త్రము గురువును ఈ క్రింది విధముగా నిర్వచించుతూ వున్నది.
గుకారస్త్వంధకారస్యాత్ రుకారస్తన్నిరోధకః
అంధకార వినాశిత్యాత్ గురురిత్య భిదీయతే
‘గు’ అనగా అంధకారము, ‘ఋ’ అనగా దానిని నిలువరించేది అంటే ప్రకాశము. అంటే
అజ్ఞానమును తొలగించి జ్ఞానభిక్ష నొసగేవాడు గురువు. ఆయనకు పాఠ్యాంశములతో
నిమిత్తము లేదు. శిష్యునికి చేయూతనిచ్చుటకు ఎల్లవేళలా సిద్ధముగా ఉంటాడు. ఇంత
అంతరార్థము కలిగిన ‘గురు’ శబ్దమునకు సమాన శబ్దమును మనము ఆంగ్లములో
చూడగలమా!పై మువ్వురికీ పురోదృష్టి పూర్వదృష్టి , అంతర్ దృష్టి (fore sight, far sight, in sight)
నేటి Teachers లో కేవలము sight మాత్రము ఉంటుంది. వీరు చాత్రునియోక్క తాత్కాలిక
దీర్ఘకాలిక ప్రయోజనముల గూర్చి యోచించుటయేగాక వానిని సాధించుటకు తగిన
వనరులపై తమ అంతః దృష్టినుంచుతారు.
ఇక తిరిగీ అసలు విషయమునకొస్తే ఆ 300 మంది విద్యార్థులున్న తరగతిలో ఒక 15
మంది చురుకైన విద్యార్థులను ఎంచుకొనేవారు. వారి స్తోమతను బట్టి 1 నుండి 15
వరకు ఒక అనుక్రమణికను ఏర్పరచుకొనేవారు. అదేవిధముగా ఆ మిమిగిలిన 285
మందిని చదువులో వారి స్థాయిని బట్టి 15 విభాగాలు చేసేవారు. అప్పుడు ఒక్కొక్క
విభాగానికి 19 విద్యార్థులు వుంటారు. అంటే ఈ కాలములో లక్షలు కట్టి చదివించే
Corporate Schools లాగానే! అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థికి విలోమము
(Inverse) గా, చదువులో పూర్తి వెనుకబడిన గుంపును (సమూహమును)
ఒప్పజేప్పేవారు. అప్పుడు 15 వ వ్యక్తి మరియు ఆ 15 వ సమూహము మధ్యన
ఆంతర్యము తక్కువగా వుంటుంది. అంటే మొదటివాడు తన సమూహమునకు అధ్యాపకుదౌతాడు 15వ వాడు తన గుంపునకు విమర్శకుడౌతాడు. వారు ఎక్కువగా
చర్చలలో పాల్గొంటారు. వారి నాయకునికి కూడా సందిగ్ధత ఏర్పడితే తమ అధ్యాపకులు
లేక ఆచార్యులవద్ద నివృత్తి చేసుకొంటారు. ఇంత సుగమమైన విధానము నేటి
విద్యావిధానములో చూడగలమా!
మిగిలినది వేరొకసారి ........
Comments
Post a Comment