Posts

Showing posts from March, 2025

గౌతమ మహర్షి - అహల్యాదేవి

  గౌతమ మహర్షి - అహల్యాదేవి https://ajaraamarasukthi.blogspot.com/2025/03/blog-post_24.html దండకమండలంబులును ధ్యానము తప్ప మరేమి   కోరకన్ నిండగు లోక శోభనము నిష్ఠుర నీమ నిబంధనావళిన్ మెండుగ గోరు నట్టి ముని మూకలు నేడెటు బోయినారొ ఆ నిండు తపోనిధానమును     నిర్మల మానసినౌచు మ్రొక్కెదనన్     గౌతమ మౌనికిన్ మరియు కల్పనకందని సుందరాంగియౌ మాత అహల్యకున్   మరి కుమారిత   అంజని దేవికిన్ మరిన్ తాతగు బ్రహ్మ పేరుతన తండ్రి దయన్   గల పుత్రుకున్   స్వజా         మాత ఉదంకుడై దనరు మాన్యుని వర్గుకు అంజలించెదన్   గౌతముడు బ్రహ్మమానస పుత్రుడు. అంటే బ్రహ్మ యొక్క సంకల్పబలము చేతనే పుట్టినవాడు. ‘గౌ’ శబ్దమునకు వేదము లేక వేదములు అనికూడా ఒక అర్థము. అంటే గౌతముడు అత్యుత్కృష్ట వేదనిధి అని మనము అన్వయించుకొనవచ్చును. లోకోపకారియై, సహన సద్భావనల ప్రతీకయై   సాగునీరు, తాగునీరునివ్వగల   గంగాసమానమగు నదీ జన్మకు కర్తయై లోకకళ్యాణ కర్తగా భాసిల్లు ఒక మహర్షి కావలెనని సంకల్పించి గౌతముని జన్మకారకుడైనాడు బ్రహ్మదేవుడు. జన్మించిన పది సంవత్...

శుంభ నిశుంభుల వథ

శుంభ నిశుంభుల వథ     https://ajaraamarasukthi.blogspot.com/2025/03/blog-post_20.html      నిర్మల   సాధు సంత ఋషి నిర్జర శ్రేణిని హింస చేయగా దుర్మద దుష్ట ధూర్త గుణ దుర్నయ సంతతి యౌచు రాక్షసుల్ ధర్మము వీడి హింసకు నితాంతము ప్రోత్సహమందజేయ నా     దుర్మతులన్ వధించి బహు దుర్గతి గూర్చగ దుర్గ వచ్చెడిన్         ఈ విధముగా నానాపాట్లూ పెట్టే     శుంభ నిశుంభులను సోదరద్వయము   యొక్క ధాటి కోపలేక దేవతలంతా తమ మొరలాలకింపజేయ   బ్రహ్మలోకమును     చేరుకున్నారు. ఆ రక్కసిద్వయము   పీచమణచడానికే , ' కౌశికి ' అన్న దేవతను   ఆవిర్భవింపజేసి ఉంచిన విధాత , ఆమె కాళికామూర్తి యై మాతంగిగా విలసిల్లుతుందనీ, ఆమెను ఆరాధించ వలసిందని దేవతలకు సూచించినాడు చతుర్ముఖుడు. అంతా భక్తిశ్రద్ధలతో ఆమెను అలాగే కొలిచి తమ కోర్కెలీడేర్చుకొంటామని తెలిపి ఆవిధముగానే చేయసాగినారు.   వారిపట్ల సుప్రసన్నయై , ఆ కదంబనవాసిని ధైర్యం చెప్పి కరుణ కురిపించి వారికోర్కె తగిన సమయమున తీరుస్తానని మాట ఇచ్చింది . .ఒక పర్యాయము ఆమె అతిశయించిన రూపలా...

అంధకాసుర వథ

  అంధకాసుర వథ https://ajaraamarasukthi.blogspot.com/2025/01/2024.html ప్రకృతి నవవసంత మలయ మారుతీ భరితమై సురుచిర సౌందర్య మయమై దేవతలకే ఆ అపురూప ఆనందమనుభవింప ఉవ్విళ్ళూరజేయుచున్న, మందరగిరిపై విహారం చేయ పార్వతి పరమేశ్వరులు   సంకల్పించి అక్కడ విహరిస్తూండగా , శివుడు మహానందపరవశుడై తూర్పు దిక్కు చూస్తూ నిలబడివుండినాడు. ఓ క్షణంపాటు మోహపరవశ అయిన పార్వతి వెనుక నుండి వెళ్లి చిలిపిగా , ఆయన కళ్లు మూసింది. దాంతో సమస్త లోకాలకూ చీకటి కమ్మినట్లయింది. హటాత్తుగా కమ్మిన ఆ అంధకారానికి పార్వతి కూడా నివ్వెరపోయింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళనల వల్ల , అరచేతుల్లో స్వేదం కమ్మింది. ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడి అంధకార సంఘటితమైనందున ' అంధకుడు ' అనే ఓ గ్రుడ్డి బాలకుడు ఆ సందర్భమున పరమేశ్వరునికి ఉద్భవించినాడు. ఇది ఇట్ల ఉంచితే, హిరణ్యాక్ష - హిరణ్య కశిపులనే ఇద్దరు సోదరులలోను , హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే మహావిష్ణు భక్తుడైన కొడుకు ఉదయించగా , హిరణ్యాక్షుడికి ఎంతకాలానికీ సంతానం కలుగకపోపోవుటచేత ఆతడు శివునికై తపమాచరించుచున్న తరుణంలో ఈ బాలకుడు జన్మించడం జరిగింది. చీకటి వల్ల అతడు గ్రుడ్డివానిగా పుట్టినా...