Posts

Showing posts from June, 2025

అసాధారణ ప్రజ్ఞాశాలి చెట్టూర్ శంకరం నాయర్ గారు

 ర్  అసాధారణ ప్రజ్ఞాశాలి  చెట్టూర్ శంకరం నాయర్ గారు  https://ajaraamarasukthi.blogspot.com/2025/06/blog-post_11.html శంకరన్ నాయర్ 1857 జులై 11 న పాలక్కాడ్ జిల్లా , మంకర గ్రామంలో హిందూ కులీన కుటుంబానికి చెందిన నాయర్ మన్మయిల్ రాముణ్ణి పణిక్కర్ , పార్వతీ అమ్మ చెట్టూర్ దంపతులకు జన్మించినాడు. అతని ప్రారంభ విద్య సంప్రదాయ శైలిలో ఇంట్లో ప్రారంభమైనది. తరువాత మలబార్‌లోని పాఠశాలల్లో కొనసాగింది. అతను కాలికట్‌లోని ప్రాంతీయ   పాఠశాల నుండి ఆర్ట్స్ పరీక్ష మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించినాడు. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి 1877 లోతన ఆర్ట్స్ పట్టాను పొందినాడు.రెండు సంవత్సరాల తరువాత మద్రాస్ న్యాయ కళాశాలనుండి లా పట్టాను పొందినాడు. ఆతరువాత నాయర్ గారు   1880 లో మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాది వృత్తి ప్రారంభించినాడు. 1884 లో మద్రాస్ ప్రభుత్వం అతడిని మలబార్ రాష్ట్రంపై ఒక విచారణ సంఘంలో సభ్యుడిగా నియమించింది. 1908 వరకు , ఆయన ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ గా మరియు   తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేసినాడు. 1908 లో , ఆయన   మద్రాసు ఉన్నత న్యాయస్థానం శాశ్వ...

గీత - అధీత

  గీత - అధీత https://ajaraamarasukthi.blogspot.com/2025/06/blog-post_9.html సనాతన ధర్మమును అవలంబించువారెవరైనా 'భగవద్గీత' అన్న పేరు వినని వారుండరు. ఒక 30, 40, సంవత్సరముల క్రిందయితే ఇది భారతములోని భీష్మ పర్వములోవస్తుంది, ఇందు శ్రీకృష్ణ భగవానుడు అర్జనునకు కర్తవ్యమును బోధించి కార్యోన్ముఖుని చేస్తారు అన్నమేరకు జిజ్ఞాసువులకు తెలిసివుండేది. నేడు పరిస్థితి ఆవిధముగాలేదు. గీతా ప్రాచుర్యము పెరిగినది. శ్రీయుతులు గంగాధర శాస్త్రి గారివంటివారు సంపూర్ణ భగవద్గీతను సమగ్రశ్లోకములను భావ మరియు భక్తి యుక్తముగా ఆలపించి ఆలపించి వివరించినారు.ఇప్పుడు 'గీత'(అమ్మాయి)అంటే నా 'Friend' కాదు అనే స్థితిలో వుండే యువకులు కూడా నేడు జీవన శైలిని పొందుపరచిన మార్గదర్శకముగా భావించుచున్నారు. ఇది ఇట్లుండగా కాస్తో కూస్తో చదువుకొన్న నాలాంటి ప్రతివానికీ భగవద్గీతమీద తనకు తోచిన టీకా టిప్పణి వ్రాయుట, లేకుంటే ఆ శ్లోకములను పద్యరూపములో వ్రాయుట ఒక ఆచారము గా పరిధవిల్లుచున్నది. యింది. గతములో కొంత కాలము ఘంటసాల గారి భగవద్గీత కేసెట్లు స్వర్గస్థులను ఉంచినచోట వినిపించేవారు. ఆ సాంప్రదాయము ఇపుడు మసకబారింది. ఇది ఎంతో సంతోషక...