Posts

Showing posts from December, 2024

వేదవాక్కు

  వేదవాక్కు https://ajaraamarasukthi.blogspot.com/2024/12/blog-post_26.html 'నమస్తే' అన్న పదమును ఆంగ్లములోనికి అనువదించవలసి వస్తే I am at your service అని చెప్పుకొనవచ్చును. ఇది యథాతతమైన అర్థము కాదు. అసలుగా నమస్కరించిన వ్యక్తి ఏమి చెబుతున్నాడంటే 'నాదేమీ లేదు అంతా మీదే'. ఎంత గొప్ప భావమో చూడండి. ఎదుటివానికి మన చేయి కలుపుటచే మనకు INFECTION రావచ్చునేమోగానీ మన రెండు చేతులూ మనము కలుపుకోనుటచే మనకు వాటిల్లబోయే ముప్పులేదు. పై పెచ్చు రెండు చేతులూ జోడించి నమస్కరించుతున్నామంటే అది ఎదుటివానికి మాత్రమే కాదు మనలోని దేవునికి కూడా! అదేవిధముగా నిద్దురలేచినప్పటినుండి పడుకొనే పర్యంతమూ Good Morning, Good Afternoon, Good Evening, Good Night, Sweet Dreams అన్న ఈ వెల్లువ పొంగి పొరలుచుండ వలసినదేనా! ఒక్క మాట పరమాత్ముని కోరితే అది మనము Good Morning, Good Afternoon, Good Evening, Good Night, Sweet Dreams చెప్పని వారికి కూడా అన్వయము ఔతుంది కదా! మనము Sweet Dreams చెప్పిన వానికి భయంకరమైన కల రాదా! రావచ్చు అనుకొంటే చెప్పుట ఎందుకు. మనసును ఆవహించిన మబ్బు వీడాలంటే ఒక్కసారి మన ధర్మము వైపు చూద్దాము. స్వస్తి...

గీత - అధీత

  గీత - అధీత- 1వభాగము https://ajaraamarasukthi.blogspot.com/2024/12/1.html భగవంతుడు తన సందేశమును తన అంశజుడగు వేదవ్యాసుని ద్వారా తాను అర్జునునికి తెలిపిన వేదాంత సారమును మనపై మక్కువ ఎక్కువగా కలిగినవాడై తెలియజేసినాడు.     ఇక్కడ ఒక్క విషయమును తెలుపవలసి వుంటుంది. కృష్ణ శబ్దమునకు అర్థము నలుపు అన్నది మనకందరకు తెలిసినదే! అదే విధముగా అర్జున శబ్దమునకు ఒక అర్థము తెలుపు. ఒక తమాషా అయిన విషయము ఏమిటంటే ఈ రెండూ రంగులు కాదు. మనము వానిని రంగులుగా భావించుకొంటున్నాము. ఏదయినా చీకటి అంటే నలుపు వదిల్తే తెలుపు లోనికి రావలసిందే! అదేవిధముగా వెలుగు అంటే తెలుపు వదిలితే నలుపును చేరవలసినదే! ఈ తెలుపు నలుపే జీవాత్మ పరమాత్మ. అర్జునునము అన్న పదమునకు కసవు ,   బంగారు అన్న రెండర్థాలు వున్నాయి. అర్జుని అనగా ఆవు అని ఒక అర్థము. ఇపుడు చూడండి ,   పరమాత్మ కశ్మల దూషితమగు మనసును తన గీతా బోధనచే సువర్ణము గావించినాడు. పేరు మారలేదు కానీ మనిషిలోని ప్రకృతి మారింది. ఇక అర్జుని అంటే ఆవు అని చెప్పుకొన్నాము.ఆవు పవిత్రతకు దైవత్వమునకు సంకేతమన్నది మనకు తెలిసిన విషయమే! అంటే నారాయణుడు తన గీతా బోధచే     నరు...

ఝల్కారీ బాయి (వికిపీడియా ఆధారంగా )

 ఝల్కారీ బాయి (వికిపీడియా ఆధారంగా ) https://ajaraamarasukthi.blogspot.com/2024/12/blog-post_17.html నిష్పాక్షిక దృష్టితో చరిత్రను తరచి చూస్తే కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో నిష్టుర సత్యాలు వెలుగు చూస్తాయన్నది అక్షరసత్యం. చరిత్రకారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రాక అలా మరుగునపడ్డ ఝల్కారిబాయి జీవిత చరిత్ర ఎంత విలక్షణమైనదో అంత అపురూపమైనది. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారిబాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం. ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మిం చిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, ...

గణితము అచ్యుతాయనమః - అనంతాయనమః

                         గణితము  అచ్యుతాయనమః - అనంతాయనమః https://ajaraamarasukthi.blogspot.com/2024/12/blog-post_12.html సమస్త శాస్త్రములకు మూలము గణిత శాస్త్రము. ఆవిషయమును వేనకు వేల సంవత్సరములకు పూర్వమే మన శాస్త్రజ్ఞులు గుర్తించినారు. గణిత అంతరిక్ష ఖగోళ శాస్త్ర విషయములను వేదములయందే ఉతంకించబడినది. తురుష్కులు, బుడుతకీచులు తదితర అప్రాచ్యులు మన శాస్త్రములను సంస్కృతిని తమ శక్తివంచన లేకుండా సర్వనాశనము చేసినారు. అయినా మన మేధావులు కొందరు మన గణితవైభవమును దుర్మతుల దురంతములనుండి కాపాడి మనకు అందజేసినారు. వారి దయవలన మనకు ఎందఱో మహనీయులగు గణిత శాస్త్రజ్ఞుల గూర్చి తెలుసుకొనగల్గినాము. వారిలో కొందరిపెర్లను ఈ క్రింద తెలియజేయుచున్నాను , పాణిని, పింగళుడు,వరాహమిహిరుడు, ఆర్యభట్టు, యతి వృషభుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు-1, శ్రీధరుడు, మహావీరుడు, పావులూరి మ ల్లన - మొదటి తెలుగు గణిత శాస్త్రవేత్త, ఆచార్య హేమచంద్రుడు, భాస్కరాచార్యుడు-2, నారాయణ పండితుడు, మాధవుడు, పరమేశ్వరుడు, నీలకంఠ సోమయాజి శంకర వారియార్, రఘునాధ శిరోమణి, జ్యేష్టద...

వేదాంత అధ్యయనము-అర్హత

  వేదాంత అధ్యయనము-అర్హత https://ajaraamarasukthi.blogspot.com/2024/12/36.html ( శృంగేరి శారదా పీఠం 36 వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ భాషణమును నేను ఆకళింపు చేసుకున్న రీతిలో నా మనోభావన మీ ముందు ఉంచుచున్నాను.) భరత ఖండమునందు వేదాంత ధోరణిలో మాట్లాడని వారు లేరు , అది పండితుడే కానీ పామరుడేకానీ. కానీ వేదాంతమునభ్యసించి సాధించినవారు సకృత్తు. ఇక వేదాంత ఉపన్యాసాలు చేయుటలో ఎంతోమంది పందితులనబడేవారు utube లో మనకు పుంఖానుపుంఖాలుగా అగుపించుతూనే ఉంటారు. ఆవిధముగా తమ వాగ్విలసనముతో ప్రభుత్వము ఒసంగు పదములను శిరౌర్యముగనెంధాచి, వద్దంటూనే గ్రహించే వాళ్ళూ ఉంటారు. ఇది ఒక వర్గమైతే కీర్తి కండూతి లేని మహా పండితులూ లేకపోలేదు. కానీ సాధకులు కనిపించరు. ఇక నా విషయమునకు వస్తే : జ్ఞానము లేదు సుంతయును జ్ఞాత్వము పొందగ శక్తిలేదు నా స్థానము మూర్ఖచిత్తతతి సంగతి యందున గల్గు గాంచగా ఐనను స్వామి పాదముల నాత్మ దలంచి తలొంచి శ్రద్ధతో భానుని బోలె నాగురువు భాసము గూర్చగ వ్రాయ బూనితిన్   అనేకమంది అనేక పండితులద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు. ఉపనిషత్తులలో , బ్రహ్మసూత్రములలో , భగవద్గీతల...