సాళ్వ దంతవక్త్రుల వధ
సాళ్వ దంతవక్త్రుల వధ https://ajaraamarasukthi.blogspot.com/2024/07/blog-post_14.html ఇందుగల భాగవత పద్యములు శ్రీయుతులు భాగవత గణనాధ్యాయి గారి అంతర్జాల భాగవతము నుండి తీసుకొనబడినవి. వారికి కృతజ్ఞుడను,. సాళ్వ దేశపు రాజు సాళ్వుడు. సాళ్వ దేశమును పరిపాలించిన రాజులందరూ సాళ్వుని గానే వ్యవహరించబడినారు. వీరిలో రుజుమార్గమున నడచినవారూ ఉన్నారు దుష్ట సాంగత్యముతో దుర్మరణము పాలయిన వారూ ఉన్నారు. ఈ రెండవ కోవకు చెందినా వారిలో మనము మాట్లాడుకోబోయే సాళ్వుడు ఈ రెండవ కోవకు చెందినవాడు. శ్రీకృష్ణుని దైవత్వమును గుర్తించక ఆహంకారియై శ్రీకృష్ణుని , రుక్మిణిని గోమ్పోవు సమయమున రుక్మితో చేతులు కలిపి , ఎదిరించినవారిలో ఒకడు ఈ సాళ్వుడు. రుక్మికి జరిగిన శృంగభంగమునకు ఎంతగానో పరితపించి రుక్మిని సమర్థించిన జరాసంధాది రాజులముందు కృష్ణునే కాక మొత్తము యడువంశామునే నాశనము చేస్తానని శపథము చేసి ఒకానొక కీకారన్యమున ప్రవేశించి తగిన స్థలమును ఎన్నుకొని శివదీక్షాతత్పరుడై , ఒక పిడికిలి అవనీరజమును మాత్రము రోజునకొకపరి భుజించి కఠోర నియమ నిష్ఠలతో సంవత్సన్తర్దానమైనాడు ర కాలము తపమాచ...