మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

https://ajaraamarasukthi.blogspot.com/2025/07/httpscherukuramamohan.html

ఈ వ్యాసమును నాలుగు భాహాగాములుగా విభాజించినాను.  ఒక్కొక్క భాగము ఇంచుమించుగా ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. వరుసగా మనాలుగు రోజులు ప్రకటించి 10వ తేదీకి ముగిస్తాను. ఈ శ్రమ అంతా మన యువత మన గతమును అర్థము చేసుకొనుటకే! తప్పక క్రమము తప్పక చదివేది.

America అన్న పేరు ‘అమెరికా’కు ఎట్లు వచ్చింది అంటే:

Amerigo Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9,

1454 – February 22, 1512) was an Italian explorer, financier, navigator, and cartographer from the Republic of Florence. Sailing for Portugal around 1501–1502, Vespucci demonstrated that Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially conjectured from Columbus' voyages) but a separate continent described as the "New World". (Courtesy Google)

పైన, మనము నెత్తిన పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.

దీనినిబట్టి మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు

అత్యంత ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,

అర్థవంతముగా ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ

తమ సంస్కృతిని చాటునటువంటి ఒక పేరును, ఆ పేరును ప్రతిబింబంపజేసే

జాతీయగీతమును వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు

మనదేశమునకుండగా,దేశ మాతను అచంచలమైన భక్తితో ప్రార్థించే 'వందేమాతరం'

గీతముండగా నిర్దుష్టముగా వానిని మనవి  అని అవి మాత్రమె ఎందుకు

ఉపయోగించము అని నా మనవి.

 మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి ఏనాడైనా

ఆలోచించినామా! మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమును, మన ఉదాసీనత వల్ల, ఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామో, ఈనాటికీ బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.

 మనము అధికముగా ఆలపించే  జాతీయ గీతము

 నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦

 రూపాయలు  అనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో

 బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరం' గీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్

 ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ

 సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే

 అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర్ గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ  గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది.

 ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు  కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది  ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే  సాక్ష్యము .

 In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of

 Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can  be no debate about it. Of course Bankimchandra does show Durga to be  inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can  be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [The  Nation].

మే 10, 2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో  కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు  నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరం'

ఆలపించరాదని ఉద్ఘాటించినది  రవీంద్రులవారే! అందులోని, ఆయన చెప్పిన కొన్ని చరణములు తీసివేసిన తరువాత 1896 కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!

 మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ  గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో  సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో  ప్రతిఘటన ఏదీ!

 ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం.లో వ్రాయబడినది.

 ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత విదుషీమణి కావడం వల్ల,  సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగిది .

ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక

మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ జాతుల ,పర్వతముల, నదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్ గారు నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది.

ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V గారికి 1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదుకదా !

 ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని

తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు ఆయన చొప్పించిన అబిప్రాయము.

ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .

"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him especially to welcome theEmperor.(Statesman,Dec. 28, 1911)"The

proceedings began with the singing by Rabindranath Tagore of a song specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28, 1911) "When the proceedings of the Indian National Congress began on Wednesday 27th December 1911, a Bengali song in welcome of the Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was alsoadopted unanimously." (Indian, Dec. 29, 1911).

 ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో, కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్' సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే,

తన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం జరిగింది.

 మన, అధికముగా ఆలపింపబడే జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.

 విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో

గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణము అర్థము చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!

జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)

 జనగణమన్ అధినాయాక్ జయహే, భారత భాగ్య విధాతా

పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా

వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా

తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగే, గాహే తవ్ జయ్ గాథా

జన్ గణ్ మంగల్ దాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll

అహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ

హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖ్ఖిస్తానీ

పూరబ్ పశ్చిం ఆసే, తవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా

జనగణ ఐక్యవిధాయక్ జయ్ హే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll

పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ

తుం చీర్ సారథి, తవ రథ్ చక్రే, ముఖరిత్ పథ దిన్ రాత్రీ

దారుణ్ బిప్లవ్ మాజే, తవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా

జనగణ పథ్ పరిచాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll

ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే

ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే

దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకే, స్నేహమయీ తుమీ మాతా

జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll

రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే

గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే

తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే

తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే

జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll

"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల

ఆధారములను ఒకపరి పరికించుదాము -

మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.

1. 1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం జరిగింది.

2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే.

3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము.

మరివిధాత అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ

కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా! దేశమును స్త్రీ తో పోల్చియుంటే 'విధాత్రి' అనియుండవలసినది.

4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆస – తవ సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది.

పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని

అనుకొనుటకు వీలు కాదు, అన్వయము కుదరదు కాబట్టి.

6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం "రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై కదా వుండినారు.

7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్ పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునా? వాడ తగునా?

8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా!

పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న రవీంద్రనాథ ఠాకూర్ గారు,  బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును "టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!

మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత

జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.

ఈ విషయమును గూర్చి  కొంత చర్చించుకొందాం........     

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి