మోహము – ధర్మమార్గము
మోహము – ధర్మమార్గము https://ajaraamarasukthi.blogspot.com/2024/05/blog-post_22.html కాశీలో గంగానదీ తీరమున , మణికర్ణికా ఘట్టము ఒడ్డున ఉదాసీనముగా ఒక వ్యక్తి ఉండేవాడు. ఒంటిపై చొక్కా ఉండేదికాదు. అందుచే మేనిపై ఉన్న యజ్ఞోపవీతము అగుపించేది. అదే దారిన ఒక పండితుడు ప్రతిరోజూ అతనిని చూస్తూ పోయేవాడు. ఎక్కడికీ, ఆటను ఉత్కంఠత భరించలేక అతనిని సంస్కృతములో “ఎందుకు ఏ అనుష్ఠానము చేసుకోకుండా అట్లు కూరుచొనియుంటావు” అని అడిగినాడు. అందుకు జవాబుగా ఆ వేదాంతనిధి ఈ విధముగా సంస్కృత శ్లోకరూపములో జవాబు చెప్పినాడు. మృతా మొహమాయీ మాతా జాతస్య పుత్ర వ్యామోహయః l సూతకం వర్తతే నిత్యం కథం సద్యోపాసనే ll నాలో అనుదినమూ మొహమమయమైన తల్లి మరణింతూ వుంది. వ్యామోహమనే పుత్రుడు ఉదయించుచున్నాడు. ఈవిధముగా ప్రతిదినమూ సూతకముతో సతమముచున్న నేను జపతపాలకు అర్హుడను కాలేను కదా! అన్నాడు. ఆమాటతో ఆపండితుడు ఆ వేదాంతనిధి పాదాలకు దండప్రణామము ఆచరించి ‘మహానుభావా! అనుష్ఠానమున కన్న ముఖ్యమయిన స్వార్థము ఆశలను జయించుట అన్నది సాధించి అనుష్ఠానమునకు గడన్గుతాను అని చెప్పి శెలవు తీసుకొన్నాడు. స్వస్తి.