Posts

Showing posts from May, 2024

మోహము – ధర్మమార్గము

  మోహము – ధర్మమార్గము https://ajaraamarasukthi.blogspot.com/2024/05/blog-post_22.html కాశీలో గంగానదీ తీరమున , మణికర్ణికా ఘట్టము   ఒడ్డున ఉదాసీనముగా ఒక వ్యక్తి ఉండేవాడు. ఒంటిపై చొక్కా ఉండేదికాదు. అందుచే మేనిపై ఉన్న యజ్ఞోపవీతము అగుపించేది. అదే దారిన ఒక పండితుడు ప్రతిరోజూ అతనిని చూస్తూ పోయేవాడు. ఎక్కడికీ, ఆటను ఉత్కంఠత భరించలేక అతనిని   సంస్కృతములో “ఎందుకు ఏ అనుష్ఠానము చేసుకోకుండా అట్లు కూరుచొనియుంటావు” అని అడిగినాడు. అందుకు జవాబుగా ఆ వేదాంతనిధి ఈ విధముగా సంస్కృత శ్లోకరూపములో జవాబు చెప్పినాడు. మృతా మొహమాయీ మాతా జాతస్య పుత్ర వ్యామోహయః l సూతకం వర్తతే నిత్యం కథం సద్యోపాసనే ll నాలో అనుదినమూ మొహమమయమైన తల్లి మరణింతూ వుంది. వ్యామోహమనే పుత్రుడు ఉదయించుచున్నాడు. ఈవిధముగా ప్రతిదినమూ సూతకముతో సతమముచున్న నేను జపతపాలకు అర్హుడను కాలేను కదా! అన్నాడు. ఆమాటతో ఆపండితుడు ఆ వేదాంతనిధి పాదాలకు దండప్రణామము ఆచరించి ‘మహానుభావా! అనుష్ఠానమున కన్న ముఖ్యమయిన స్వార్థము ఆశలను జయించుట అన్నది సాధించి అనుష్ఠానమునకు గడన్గుతాను అని చెప్పి శెలవు తీసుకొన్నాడు. స్వస్తి.

పతజలి విరచిత చరణ శృంగ రహిత స్తోత్రము

  పతజలి విరచిత చరణ శృంగ రహిత స్తోత్రము https://ajaraamarasukthi.blogspot.com/2024/05/blog-post.html ఈకాలము వేలు లక్షలు కోట్లు సంపాదించుచున్న 'యోగా' కు మూల పురుషుడు పతంజలి. ఆ మహనీయుడు లోక కల్యాణమును కోరుకొన్నాడు కానీ నేటి స్వార్థపరుల మాదిరి ధనార్జన కోరుకోలేదు. ఆయన ఉదారముగా మనకు అందించిన జ్ఞానమును, నేడు మంచినీళ్ళు అమ్ముకొన్నట్లు, అమ్ముకొంటున్నారు. ఇది శిగ్గు పడవలసిన విషయము. ఎవరు అన్నది మీ విచక్షణకే వదలుచున్నాను. ఈ స్తోత్రము కూడా ఆయన రచనే. ఇందులో అతి కఠినమైన ఒక ప్రత్యేకత వుంది. చదివినవారికి తెలుస్తుంది. జిజ్ఞాసువులు ఈ స్తోత్రమును తప్పక చదవండి. చదువుట, తెలుసుకొనుట, చర్చించుట, గమనించుట, వీనివల్ల మన విజ్ఞానము అభివృద్ధియౌతుంది. మనము post చేసే video ల వల్ల మాత్రము కాదు. అవి కేవలము క్షణికానందము సమకూర్చునవి. చెప్పినానని తప్పుగా తలువవద్దు.    మిగిలినది మళ్ళీ''''''' మొట్ట మొదట  –  పతంజలి ,  శివుని వాహనమైన నంది  –  వీరిరువరికి సంబంధించిన  ఒక  చాటుకథను చెప్పాలి. పతంజలి మహర్షి యోగశాస్త్రమును రచించిన మహాముని.  అతనికి  ఒకనాడు పరమేశ్వరుని సందర్శ...